మొత్తానికి సస్పెన్స్ వీడిపోయింది. ‘రుద్రమదేవి’ తర్వాత సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తీయబోయే ‘శాకుంతలం’లో లీడ్ రోల్ చేయబోయేది సమంత అని తేలిపోయింది. ఈ పాత్రకు ముందు ప్రధానంగా వినిపించిన పేరు.. పూజా హెగ్డేదే. శకుంతల పాత్ర అంటే ఒక అందాల రాశి అయ్యుండాలి. అలాగే ఆ కథానాయికలో ఒక గ్రేస్ ఉండాలి. మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ అయితే సినిమాకు క్రేజ్ వస్తుంది.
వీటిని దృష్టిలో ఉంచుకుని పూజా హెగ్డేను ఈ పాత్రకు తీసుకుందామని గుణశేఖర్ గట్టి ప్రయత్నమే చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ మాంచి డిమాండ్లో ఉన్న పూజా.. ఈ దశలో ఇలాంటి రిస్కీ ప్రాజెక్టు ఎందుకని ఆగిపోయిందని గుసగుసలు వినిపించాయి. పూజా కాదన్న పాత్రను సమంత ఓకే చేసింది అనగానే ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఆ మధ్య సమంత సినిమా ‘మజిలీ’ టీవీలో చూస్తూ.. ఒక ఫొటో తీసి, సమంతనుద్దేశించి ‘ఈమె అందంగా ఉందా’ అని పూజా ప్రశ్నిస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దాని మీద సమంత, అక్కినేని అభిమానులు ఫైర్ అయిపోయారు. ఐతే తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది పూజా. కానీ ఆమె కావాలనే ఇలా చేసిందనే అనుమానాలు సమంత అభిమానుల్లో ఉన్నాయి. సమంతను కూడా ఈ వ్యాఖ్య హర్ట్ చేసే ఉండొచ్చన్న సందేహాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పూజా వద్దన్న పాత్రను సమంత ఓకే చేసిందనేసరికి.. దీనిపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. పూజా మీద నిజంగా సమంతకు కోపం ఉందా.. ఆ నేపథ్యంలోనే కసితో ఈ సినిమా ఒప్పుకుందా.. గుణశేఖర్ కూడా కావాలనే సమంతను సంప్రదించాడా అనే చర్చ నడుస్తోంది. ఆ సంగతలా వదిలేస్తే.. రొమాంటిక్ టచ్ ఉన్న ‘శాకుంతలం’ సినిమాలో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరం. ఇక సమంత ఈ పాత్ర డిమాండ్ చేసేంత గ్లామరస్గా కనిపించగలదా అన్నది సందేహం.
This post was last modified on January 3, 2021 12:12 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…