SKLS గేలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బృంద రవిందర్ దర్శకత్వంలో E. మోహన్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే..నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి బ్లాక్ n వైట్
టైటిల్ను అధికారికంగా ప్రకటిస్తూ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ను త్వరలోనే విడుదలచేయనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా..
దర్శకుడు బృంద రవిందర్ మాట్లాడుతూ – న్యూ ఇయర్ రోజున మా మూవీ టైటిల్ `బ్లాక్ n వైట్`ను అనౌన్స్ చేయడం హ్యాపీగా ఉంది. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్లుక్ ని విడుదల చేస్తాం
అన్నారు.
నిర్మాత E. మోహన్ మాట్లాడుతూ – బ్లాక్ n వైట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆడియన్స్ని తప్పకుండా థ్రిల్ చేస్తుంది
అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ – బ్లాక్ n వైట్' టైటిల్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటిస్తాం
అన్నారు.
ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: ఈశ్వర్ ఎల్లుమహంతి,
సంగీతం: మణిశర్మ,
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు,
లిరిక్స్: అనంత్ శ్రీరామ్,
అడిషనల్ డైలాగ్స్: విజయ భారతి,
స్క్రిప్ట్ అసిస్టెన్స్: బి. వసుదేవ రెడ్డి,
పబ్లిసిటి డిజైనర్: అనిల్- భాను,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివ ప్రసాద్,
నిర్మాత: E. మోహన్,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బృంద రవిందర్.
This post was last modified on January 3, 2021 2:16 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…