టాలీవుడ్లో అడుగు పెట్టే యువ కథానాయకులు చాలామందికి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. ఆయన్ని కలిసే అవకాశం వచ్చినా.. తమ గురించి ఒక మంచి మాట మాట్లాడినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోతుంటారు. ఈ మధ్య ఇలాగే చిరును కలిసి ప్రశంసలు పొందినందుకు యువ నటుడు సత్యదేవ్ ఎంత పరవశించిపోయాడో తెలిసిందే. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల్లో నటనకు గాను చిరు నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. చిరుతో కలిసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడిన సత్యదేవ్.. 2020 ముగింపు సందర్భంగా తన మధుర జ్ఞాపకంగా చిరును కలిసినప్పటి ఫొటోనే సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఐతే చిరును కలిసి ప్రశంసలు పొందినందుకే ఇంత ఆనందించిన సత్యదేవ్.. చిరుతో కలిసి నటించే అవకాశం వస్తే ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరం.
ఆ అరుదైన అవకాశం సత్యదేవ్ తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ‘ఆచార్య’ తర్వాత చిరు చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్లో సత్యదేవ్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడట. అతను చేయబోయే పాత్ర ఏంటన్నది స్పష్టత లేదు. కానీ అతను మాత్రం ‘లూసిఫర్’ రీమేక్లో ఉన్నాడట. బహుశా ఒరిజినల్లో టొవినో థామస్ చేసిన పాత్రకు సత్యదేవ్ ఎంపికై ఉంటాడేమో. సినిమాలో లేటుగా రంగప్రవేశం చేసే పాత్ర.. ద్వితీయార్ధంలో కీలకంగా ఉంటుంది. ఈ పాత్రనే సత్యదేవ్ చేసేట్లయితే అతడికి మంచి గుర్తింపే రావచ్చు. మరి ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ చేసిన విలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి. తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా ‘లూసిఫర్’ రీమేక్కు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలన్న ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నారు. సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్తో కలిసి రామ్ చరణే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
This post was last modified on January 2, 2021 11:24 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…