టాలీవుడ్లో అడుగు పెట్టే యువ కథానాయకులు చాలామందికి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. ఆయన్ని కలిసే అవకాశం వచ్చినా.. తమ గురించి ఒక మంచి మాట మాట్లాడినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోతుంటారు. ఈ మధ్య ఇలాగే చిరును కలిసి ప్రశంసలు పొందినందుకు యువ నటుడు సత్యదేవ్ ఎంత పరవశించిపోయాడో తెలిసిందే. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల్లో నటనకు గాను చిరు నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. చిరుతో కలిసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడిన సత్యదేవ్.. 2020 ముగింపు సందర్భంగా తన మధుర జ్ఞాపకంగా చిరును కలిసినప్పటి ఫొటోనే సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఐతే చిరును కలిసి ప్రశంసలు పొందినందుకే ఇంత ఆనందించిన సత్యదేవ్.. చిరుతో కలిసి నటించే అవకాశం వస్తే ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరం.
ఆ అరుదైన అవకాశం సత్యదేవ్ తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ‘ఆచార్య’ తర్వాత చిరు చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్లో సత్యదేవ్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడట. అతను చేయబోయే పాత్ర ఏంటన్నది స్పష్టత లేదు. కానీ అతను మాత్రం ‘లూసిఫర్’ రీమేక్లో ఉన్నాడట. బహుశా ఒరిజినల్లో టొవినో థామస్ చేసిన పాత్రకు సత్యదేవ్ ఎంపికై ఉంటాడేమో. సినిమాలో లేటుగా రంగప్రవేశం చేసే పాత్ర.. ద్వితీయార్ధంలో కీలకంగా ఉంటుంది. ఈ పాత్రనే సత్యదేవ్ చేసేట్లయితే అతడికి మంచి గుర్తింపే రావచ్చు. మరి ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ చేసిన విలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి. తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా ‘లూసిఫర్’ రీమేక్కు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలన్న ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నారు. సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్తో కలిసి రామ్ చరణే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
This post was last modified on January 2, 2021 11:24 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…