టాలీవుడ్లో అడుగు పెట్టే యువ కథానాయకులు చాలామందికి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. ఆయన్ని కలిసే అవకాశం వచ్చినా.. తమ గురించి ఒక మంచి మాట మాట్లాడినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోతుంటారు. ఈ మధ్య ఇలాగే చిరును కలిసి ప్రశంసలు పొందినందుకు యువ నటుడు సత్యదేవ్ ఎంత పరవశించిపోయాడో తెలిసిందే. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల్లో నటనకు గాను చిరు నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. చిరుతో కలిసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడిన సత్యదేవ్.. 2020 ముగింపు సందర్భంగా తన మధుర జ్ఞాపకంగా చిరును కలిసినప్పటి ఫొటోనే సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఐతే చిరును కలిసి ప్రశంసలు పొందినందుకే ఇంత ఆనందించిన సత్యదేవ్.. చిరుతో కలిసి నటించే అవకాశం వస్తే ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరం.
ఆ అరుదైన అవకాశం సత్యదేవ్ తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ‘ఆచార్య’ తర్వాత చిరు చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్లో సత్యదేవ్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడట. అతను చేయబోయే పాత్ర ఏంటన్నది స్పష్టత లేదు. కానీ అతను మాత్రం ‘లూసిఫర్’ రీమేక్లో ఉన్నాడట. బహుశా ఒరిజినల్లో టొవినో థామస్ చేసిన పాత్రకు సత్యదేవ్ ఎంపికై ఉంటాడేమో. సినిమాలో లేటుగా రంగప్రవేశం చేసే పాత్ర.. ద్వితీయార్ధంలో కీలకంగా ఉంటుంది. ఈ పాత్రనే సత్యదేవ్ చేసేట్లయితే అతడికి మంచి గుర్తింపే రావచ్చు. మరి ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ చేసిన విలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి. తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా ‘లూసిఫర్’ రీమేక్కు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలన్న ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నారు. సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్తో కలిసి రామ్ చరణే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
This post was last modified on January 2, 2021 11:24 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…