‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది తెలుగు పాటే కానీ.. దేశవ్యాప్తంగా ఇది సూపర్ పాపులర్ అయింది. ఇంకా చెప్పాలంటే దేశం అవతల, అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ పాటకు ఆదరణ దక్కింది. ఈ పాటను తలుచుకోగానే.. అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా గుర్తుకు వస్తాడంటే అతిశయోక్తి కాదు. ఆ పాటకు వార్నర్ తన భార్యా పిల్లలతో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత వార్నర్కే చెందుతుంది. ఈ పాటకు వార్నర్ తెచ్చిన పాపులారిటీ గురించి అల్లు అర్జున్ సైతం మాట్లాడటం విశేషం.
సమంత నిర్వహించే ‘సామ్ జామ్’ షోకు బన్నీ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఇందులో ఒకచోట బుట్టబొమ్మ పాట ప్రస్తావన రాగా.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం గురించి బన్నీ చెబుతూ.. ఈ పాటను సగం పాపులర్ చేసింది డేవిడ్ వార్నరే అన్నాడు. ఇటీవల భారత్తో సిరీస్ సందర్భంగా మ్యాచ్ మధ్యలో కూడా వార్నర్ బుట్టబొమ్మ స్టెప్ వేసి స్టేడియంలో ఉన్న జనాలను అలరించాడు. ఈ విషయాన్ని కూడా బన్నీ ప్రస్తావించాడు. వార్నర్తో పాటు ఆయన భార్యా పిల్లలు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఈ పాటకు మరింత పాపులారిటీ తెచ్చారని బన్నీ అన్నాడు. ‘బుట్ట బొమ్మ’ హిట్టవుతుందనుకున్నాం కానీ.. ఈ స్థాయిలో ఆదరణ పొందుతుందని తాము ఊహించలేదని బన్నీ చెప్పాడు. ఈ పాట యూట్యూబ్లో ఏకంగా 50 కోట్ల వ్యూస్ మార్కుకు చేరువగా ఉండటం విశేషం. 32 లక్షలకు పైగా దానికి లైక్స్ వచ్చాయి ఇప్పటిదాకా.
This post was last modified on January 2, 2021 8:27 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…