‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది తెలుగు పాటే కానీ.. దేశవ్యాప్తంగా ఇది సూపర్ పాపులర్ అయింది. ఇంకా చెప్పాలంటే దేశం అవతల, అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ పాటకు ఆదరణ దక్కింది. ఈ పాటను తలుచుకోగానే.. అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా గుర్తుకు వస్తాడంటే అతిశయోక్తి కాదు. ఆ పాటకు వార్నర్ తన భార్యా పిల్లలతో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత వార్నర్కే చెందుతుంది. ఈ పాటకు వార్నర్ తెచ్చిన పాపులారిటీ గురించి అల్లు అర్జున్ సైతం మాట్లాడటం విశేషం.
సమంత నిర్వహించే ‘సామ్ జామ్’ షోకు బన్నీ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఇందులో ఒకచోట బుట్టబొమ్మ పాట ప్రస్తావన రాగా.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం గురించి బన్నీ చెబుతూ.. ఈ పాటను సగం పాపులర్ చేసింది డేవిడ్ వార్నరే అన్నాడు. ఇటీవల భారత్తో సిరీస్ సందర్భంగా మ్యాచ్ మధ్యలో కూడా వార్నర్ బుట్టబొమ్మ స్టెప్ వేసి స్టేడియంలో ఉన్న జనాలను అలరించాడు. ఈ విషయాన్ని కూడా బన్నీ ప్రస్తావించాడు. వార్నర్తో పాటు ఆయన భార్యా పిల్లలు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఈ పాటకు మరింత పాపులారిటీ తెచ్చారని బన్నీ అన్నాడు. ‘బుట్ట బొమ్మ’ హిట్టవుతుందనుకున్నాం కానీ.. ఈ స్థాయిలో ఆదరణ పొందుతుందని తాము ఊహించలేదని బన్నీ చెప్పాడు. ఈ పాట యూట్యూబ్లో ఏకంగా 50 కోట్ల వ్యూస్ మార్కుకు చేరువగా ఉండటం విశేషం. 32 లక్షలకు పైగా దానికి లైక్స్ వచ్చాయి ఇప్పటిదాకా.
This post was last modified on January 2, 2021 8:27 pm
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…