‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది తెలుగు పాటే కానీ.. దేశవ్యాప్తంగా ఇది సూపర్ పాపులర్ అయింది. ఇంకా చెప్పాలంటే దేశం అవతల, అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ పాటకు ఆదరణ దక్కింది. ఈ పాటను తలుచుకోగానే.. అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా గుర్తుకు వస్తాడంటే అతిశయోక్తి కాదు. ఆ పాటకు వార్నర్ తన భార్యా పిల్లలతో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత వార్నర్కే చెందుతుంది. ఈ పాటకు వార్నర్ తెచ్చిన పాపులారిటీ గురించి అల్లు అర్జున్ సైతం మాట్లాడటం విశేషం.
సమంత నిర్వహించే ‘సామ్ జామ్’ షోకు బన్నీ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఇందులో ఒకచోట బుట్టబొమ్మ పాట ప్రస్తావన రాగా.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం గురించి బన్నీ చెబుతూ.. ఈ పాటను సగం పాపులర్ చేసింది డేవిడ్ వార్నరే అన్నాడు. ఇటీవల భారత్తో సిరీస్ సందర్భంగా మ్యాచ్ మధ్యలో కూడా వార్నర్ బుట్టబొమ్మ స్టెప్ వేసి స్టేడియంలో ఉన్న జనాలను అలరించాడు. ఈ విషయాన్ని కూడా బన్నీ ప్రస్తావించాడు. వార్నర్తో పాటు ఆయన భార్యా పిల్లలు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఈ పాటకు మరింత పాపులారిటీ తెచ్చారని బన్నీ అన్నాడు. ‘బుట్ట బొమ్మ’ హిట్టవుతుందనుకున్నాం కానీ.. ఈ స్థాయిలో ఆదరణ పొందుతుందని తాము ఊహించలేదని బన్నీ చెప్పాడు. ఈ పాట యూట్యూబ్లో ఏకంగా 50 కోట్ల వ్యూస్ మార్కుకు చేరువగా ఉండటం విశేషం. 32 లక్షలకు పైగా దానికి లైక్స్ వచ్చాయి ఇప్పటిదాకా.
This post was last modified on January 2, 2021 8:27 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…