Movie News

సూపర్ ఫామ్‌లో బ్రహ్మానందం

బ్రహ్మానందం ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఎక్కడున్నాడు.. ఆయన సినిమాల్లో కనిపించడమే అరుదైపోయింది కదా.. ఆయన దాదాపు రిటైరైపోయారు కదా అంటారా? కానీ బ్రహ్మి ఇప్పుడు సినిమాలు చేస్తుండకపోవచ్చు.. నటుడిగా బిజీగా లేకపోవచ్చు కానీ.. చిత్రకారుడిగా మాత్రం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే తన చిత్ర కళా నైపుణ్యాన్ని చూపిస్తూ ఆయన గీసిన కళాఖండాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు బ్రహ్మి వాటన్నింటినీ తలదన్నే ఆర్ట్ గీశారు. శ్రీ వేంకటేశ్వరుడికి ఒక పూజారి ధూప నైవేద్యం సమర్పిస్తున్న దృశ్యానికి ఆయనలోని చిత్రకారుడు రూపం ఇచ్చాడు. హ్యాండ్ పెన్సిల్‌తో ఆయన ఈ ఆర్ట్ వేయడం విశేషం. దీని కోసం ఏకంగా 45 రోజుల పాటు పని చేశారట బ్రహ్మానందం. నూతన సంవత్సర కానుకగా ఇండస్ట్రీ ప్రముఖులకు తనదైన ప్రత్యేక కానుక ఇవ్వాలని బ్రహ్మానందం నిర్ణయించుకుని రెండు నెలల ముందే ఈ పని మొదలుపెట్టారట.

సొంతంగా పెన్సిల్ ఆర్ట్ గీసి.. దాన్ని ఫ్రేమ్ చేయించడంతో పాటు ఆ బొమ్మతో క్యాలెండర్ కూడా రూపొందించి… ఈ రెండు బహుమతులకు ఇండస్ట్రీలో తనకు ఆత్మీయులైన అందరికీ పంపించారు బ్రహ్మానందం. ఈ రెండు బహుమతులు అందుకున్న అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్.. ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఇది అత్యంత విలువైన బహుమతి అని.. బ్రహ్మానందం 45 రోజుల పాటు దీని మీద పని చేశారని బన్నీ వెల్లడించాడు. మిగతా సినీ ప్రముఖులకు కూడా బ్రహ్మి ఈ బహుమతుల్ని పంపినట్లు తెలుస్తోంది.

బ్రహ్మిలో ఇంత గొప్ప చిత్రకారుడున్న సంగతి కొన్నేళ్ల ముందు వరకు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయన తన నైపుణ్యాన్ని చూపించడానికి సమయం లేదప్పుడు. పాతికేళ్లకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో నంబర్ వన్ కమెడియన్‌గా ఆధిపత్యాన్ని చాటిన బ్రహ్మి.. కొన్నేళ్ల నుంచే ఖాళీగా ఉంటున్నారు. ఈ సమయంలో తన చిత్రకళను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నారు.

This post was last modified on January 1, 2021 7:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago