ఈ మధ్య ‘డర్టీ హరి’ సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ట్విట్టర్లో దాని దర్శకుడు ఎం.ఎస్.రాజును ఉద్దేశించి ఒక పోస్టు పెట్టాడు. ఎం.ఎస్.రాజు సినిమాలన్నా, ఆయనన్నా చాలా ఇష్టం గౌరవం ఉండేవని.. సినిమాలు తీయడంలో ఆయన స్టాండర్డ్సే వేరని.. కానీ ‘డర్టీ హరి’ లాంటి సినిమాలు మాత్రం తీయకండని ఈ పోస్టులో పేర్కొన్నాడు. దానికి ఎం.ఎస్.రాజు ఏమాత్రం తడుముకోకుండా.. ‘‘సుత్తి సినిమాలు చెయ్యాలా ఇంకా.. ఎవరినో మెప్పించడానికి నేను సినిమాలు చెయ్యను’’ అంటూ కుండబద్దలు కొట్టేశారు.
తాను తీసిన సినిమా విషయంలో రాజు ఎంత కన్విక్షన్తో ఉన్నారనడానికి ఈ కామెంట్ రుజువు. ‘డర్టీ హరి’ విషయంలో విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. యువతను ఈ సినిమా బాగానే ఆకట్టుకోవడంతో ఆయన ఇకపైనా ఇలాంటి బోల్డ్ సినిమాలే తీయాలని ఫిక్సయినట్లున్నారు. ‘డర్టీ హరి’ రాజు అంచనాల్ని మించి విజయం సాధించిందన్నది ట్రేడ్ వర్గాల మాట.
ఈ సినిమాను ఆయన ప్రమోట్ చేసిన తీరు.. విడుదలకు ఎంచుకున్న మార్గాలు.. అన్నీ ఆయన పనైపోలేదని చాటి చెబుతాయి. ముందుగా పే పర్ వ్యూ పద్ధతిలో ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త యాప్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు రాజు. ఇందులోని బోల్డ్ కంటెంట్ యూత్ను బాగానే ఆకట్టుకోవడంతో రిలీజ్ రోజు మాంచి డిమాండే కనిపించింది. 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. రూ.120 టికెట్ రేటుతో సినిమాను స్ట్రీమ్ చేశారు. అలా తొలి రోజే కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది.
ఇలా ఓ వారం రోజులు నడిపించి.. ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీకి సినిమాను అమ్మారు. ఇప్పుడు ఆ ఓటీటీలో సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు సినిమా చూస్తున్నారు. ఈ రెండు మార్గాల్లోనూ రాజు మంచి ఆదాయం పొందిన రాజు, ఇంతటితో ఆగకుండా ‘డర్టీ హరి’ని థియేట్రికల్ రిలీజ్కు కూడా రెడీ చేస్తుండటం విశేషం. జనవరి 8న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి కొత్త సినిమాలు దిగుతున్న నేపథ్యంలో ఒక వారం పాటు సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకుని అదనపు ఆదాయం పొందడానికి రాజు మంచి ప్లానే వేశారన్నమాట.
This post was last modified on January 1, 2021 10:02 am
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…