ఈ మధ్య ‘డర్టీ హరి’ సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ట్విట్టర్లో దాని దర్శకుడు ఎం.ఎస్.రాజును ఉద్దేశించి ఒక పోస్టు పెట్టాడు. ఎం.ఎస్.రాజు సినిమాలన్నా, ఆయనన్నా చాలా ఇష్టం గౌరవం ఉండేవని.. సినిమాలు తీయడంలో ఆయన స్టాండర్డ్సే వేరని.. కానీ ‘డర్టీ హరి’ లాంటి సినిమాలు మాత్రం తీయకండని ఈ పోస్టులో పేర్కొన్నాడు. దానికి ఎం.ఎస్.రాజు ఏమాత్రం తడుముకోకుండా.. ‘‘సుత్తి సినిమాలు చెయ్యాలా ఇంకా.. ఎవరినో మెప్పించడానికి నేను సినిమాలు చెయ్యను’’ అంటూ కుండబద్దలు కొట్టేశారు.
తాను తీసిన సినిమా విషయంలో రాజు ఎంత కన్విక్షన్తో ఉన్నారనడానికి ఈ కామెంట్ రుజువు. ‘డర్టీ హరి’ విషయంలో విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. యువతను ఈ సినిమా బాగానే ఆకట్టుకోవడంతో ఆయన ఇకపైనా ఇలాంటి బోల్డ్ సినిమాలే తీయాలని ఫిక్సయినట్లున్నారు. ‘డర్టీ హరి’ రాజు అంచనాల్ని మించి విజయం సాధించిందన్నది ట్రేడ్ వర్గాల మాట.
ఈ సినిమాను ఆయన ప్రమోట్ చేసిన తీరు.. విడుదలకు ఎంచుకున్న మార్గాలు.. అన్నీ ఆయన పనైపోలేదని చాటి చెబుతాయి. ముందుగా పే పర్ వ్యూ పద్ధతిలో ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త యాప్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు రాజు. ఇందులోని బోల్డ్ కంటెంట్ యూత్ను బాగానే ఆకట్టుకోవడంతో రిలీజ్ రోజు మాంచి డిమాండే కనిపించింది. 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. రూ.120 టికెట్ రేటుతో సినిమాను స్ట్రీమ్ చేశారు. అలా తొలి రోజే కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది.
ఇలా ఓ వారం రోజులు నడిపించి.. ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీకి సినిమాను అమ్మారు. ఇప్పుడు ఆ ఓటీటీలో సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు సినిమా చూస్తున్నారు. ఈ రెండు మార్గాల్లోనూ రాజు మంచి ఆదాయం పొందిన రాజు, ఇంతటితో ఆగకుండా ‘డర్టీ హరి’ని థియేట్రికల్ రిలీజ్కు కూడా రెడీ చేస్తుండటం విశేషం. జనవరి 8న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి కొత్త సినిమాలు దిగుతున్న నేపథ్యంలో ఒక వారం పాటు సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకుని అదనపు ఆదాయం పొందడానికి రాజు మంచి ప్లానే వేశారన్నమాట.
This post was last modified on January 1, 2021 10:02 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…