ఈ మధ్య ‘డర్టీ హరి’ సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ట్విట్టర్లో దాని దర్శకుడు ఎం.ఎస్.రాజును ఉద్దేశించి ఒక పోస్టు పెట్టాడు. ఎం.ఎస్.రాజు సినిమాలన్నా, ఆయనన్నా చాలా ఇష్టం గౌరవం ఉండేవని.. సినిమాలు తీయడంలో ఆయన స్టాండర్డ్సే వేరని.. కానీ ‘డర్టీ హరి’ లాంటి సినిమాలు మాత్రం తీయకండని ఈ పోస్టులో పేర్కొన్నాడు. దానికి ఎం.ఎస్.రాజు ఏమాత్రం తడుముకోకుండా.. ‘‘సుత్తి సినిమాలు చెయ్యాలా ఇంకా.. ఎవరినో మెప్పించడానికి నేను సినిమాలు చెయ్యను’’ అంటూ కుండబద్దలు కొట్టేశారు.
తాను తీసిన సినిమా విషయంలో రాజు ఎంత కన్విక్షన్తో ఉన్నారనడానికి ఈ కామెంట్ రుజువు. ‘డర్టీ హరి’ విషయంలో విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. యువతను ఈ సినిమా బాగానే ఆకట్టుకోవడంతో ఆయన ఇకపైనా ఇలాంటి బోల్డ్ సినిమాలే తీయాలని ఫిక్సయినట్లున్నారు. ‘డర్టీ హరి’ రాజు అంచనాల్ని మించి విజయం సాధించిందన్నది ట్రేడ్ వర్గాల మాట.
ఈ సినిమాను ఆయన ప్రమోట్ చేసిన తీరు.. విడుదలకు ఎంచుకున్న మార్గాలు.. అన్నీ ఆయన పనైపోలేదని చాటి చెబుతాయి. ముందుగా పే పర్ వ్యూ పద్ధతిలో ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త యాప్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు రాజు. ఇందులోని బోల్డ్ కంటెంట్ యూత్ను బాగానే ఆకట్టుకోవడంతో రిలీజ్ రోజు మాంచి డిమాండే కనిపించింది. 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. రూ.120 టికెట్ రేటుతో సినిమాను స్ట్రీమ్ చేశారు. అలా తొలి రోజే కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది.
ఇలా ఓ వారం రోజులు నడిపించి.. ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీకి సినిమాను అమ్మారు. ఇప్పుడు ఆ ఓటీటీలో సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు సినిమా చూస్తున్నారు. ఈ రెండు మార్గాల్లోనూ రాజు మంచి ఆదాయం పొందిన రాజు, ఇంతటితో ఆగకుండా ‘డర్టీ హరి’ని థియేట్రికల్ రిలీజ్కు కూడా రెడీ చేస్తుండటం విశేషం. జనవరి 8న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి కొత్త సినిమాలు దిగుతున్న నేపథ్యంలో ఒక వారం పాటు సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకుని అదనపు ఆదాయం పొందడానికి రాజు మంచి ప్లానే వేశారన్నమాట.
This post was last modified on January 1, 2021 10:02 am
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…