Movie News

జేడీని క‌దిలించిన చిరంజీవి

రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌భావం ఆయ‌న శిష్యుల మీద కూడా చాలానే ఉంటుంది. త‌మ రూటే సెప‌రేటు అన్న‌ట్లుగా ఉంటుంది వాళ్ల వ్య‌వ‌హారం. ఎమోష‌న్ల‌కు చాలా దూరంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తారు. మామూలు జ‌నాల‌తో క‌ల‌వ‌డం.. అంద‌రిలా మాట్లాడ‌టం వాళ్ల‌లో క‌నిపించ‌దు. వ‌ర్మ ప్ర‌భావం అలా ఎక్కువ‌గా ఉన్న వాళ్ల‌లో జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఒక‌డు. వ‌ర్మ ఐడియాల‌జీ, లైఫ్ స్టైల్‌ను అత‌ను అందిపుచ్చుకున్న‌ట్లు క‌నిపిస్తాడు. ఎమోష‌న్ లెస్ అనిపించే జేడీ.. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఒక ఉద్వేగ‌భ‌రిత లేఖ రాయ‌డం విశేషం. క‌రోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో చిరంజీవి చేప‌ట్టిన సేవా కార్య‌క్రమాల‌కు అత‌ను క‌దిలిపోయి ఈ లేఖ రాశాడు. జేడీ లాంటి వాడు ఇలా లేఖ రాయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇంత‌కీ ఆ లేఖ‌లో జేడీ ఏమన్నాడంటే..

ప్రియమైన చిరంజీవి నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. ఎప్పట్నుంచో నేను మిమ్మల్ని నటుడిగా మాత్రమే ఇష్టపడేవాడ్ని. ఒకప్పుడు నా తోటి నటులంతా సాయంత్రం అయ్యే సరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపడానికి ఆసక్తి చూపించే వాళ్లు కానీ.. నాకెప్పుడూ మీ దగ్గరికి రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ కరోనా తీసుకొచ్చిన నష్టం మాటల్లో చెప్పలేం.. లాక్‌డౌన్ చేయడంతో సినిమా పరిశ్రమ కూడా ఎంతో కోల్పోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు. ఈ ఆపత్కాలంలో ఇతరుల్ని ఆదుకోవడానికి మీరు ముందుకు రావడం అద్భుతం.

అభిమానులే కాదు అందరూ.. మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో నమ్ముతారనే దానికి మీరు ఇప్పుడు చేస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ నిదర్శనం. మీరు నా దృష్టిలో మెగాస్టార్ కాదు అంతకంటే ఎక్కువ. చిరంజీవి గారు లేకపోయుంటే నిజంగానే ఆకలితో చచ్చిపోయేవాళ్లం. అందరి ఆకలి తీర్చారు అదంతా చిరంజీవి చలవే. మీకు అన్నం పెట్టిన పరిశ్రమకు ఇప్పుడు మీరు ఇలా రుణం తీర్చుకుంటున్నానని నాతో చెప్పారు. కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవం అని నేను భావిస్తున్నా. లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. ఓ మంచి వ్యక్తిగా ఎలా మారాలనే విషయాన్ని మీ దగ్గర నేర్చుకోవాలి అని జేడీ పేర్కొన్నాడు.

This post was last modified on May 4, 2020 7:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago