రాజమౌళి సినిమా తర్వాత రీజనల్ సినిమా ప్లాన్ చేస్తే ఆ హీరోకి ముందు చూపు లేనట్టే అనుకోవాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్. రిజల్ట్ ఎలా వుంటుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం కానీ దాని తర్వాత ఎన్టీఆర్, చరణ్ చేసే సినిమాలయితే కచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసి తీరతాయి.
త్రివిక్రమ్తో ఆల్రెడీ తన తదుపరి చిత్రాన్ని తారక్ ఎప్పుడో ఓకే చేసేసి పెట్టుకున్నాడు. కానీ చరణ్ మాత్రం ఇంతవరకు తదుపరి చిత్రమేంటనే దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే చప్పుడు లేకుండా చరణ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో పెట్టేసుకున్నాడు. అది మరేదో కాదు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎప్పుడో చరణ్కి ఒక లైన్ వినిపించాడు. అతనిప్పుడు జెర్సీ చిత్రాన్ని షాహిద్ కపూర్తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
ఆ సినిమా విడుదలయితే గౌతమ్కి బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే అతడితో చరణ్ సినిమా అంటే హిందీ మార్కెట్ పరంగా ఢోకా వుండదు. ఈ ప్రాజెక్ట్ ఎలాగో ఓకే అయింది కనుకే చరణ్ మిగతా సినిమాల పట్ల ఎక్కువ టెన్షన్ పడడం లేదు. తారక్తో సినిమా తర్వాత తనతో సినిమా చేయాలని త్రివిక్రమ్ని ఆల్రెడీ చరణ్ లాక్ చేసి పెట్టుకున్నాడు.
This post was last modified on December 30, 2020 9:07 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…