రాజమౌళి సినిమా తర్వాత రీజనల్ సినిమా ప్లాన్ చేస్తే ఆ హీరోకి ముందు చూపు లేనట్టే అనుకోవాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్. రిజల్ట్ ఎలా వుంటుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం కానీ దాని తర్వాత ఎన్టీఆర్, చరణ్ చేసే సినిమాలయితే కచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసి తీరతాయి.
త్రివిక్రమ్తో ఆల్రెడీ తన తదుపరి చిత్రాన్ని తారక్ ఎప్పుడో ఓకే చేసేసి పెట్టుకున్నాడు. కానీ చరణ్ మాత్రం ఇంతవరకు తదుపరి చిత్రమేంటనే దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే చప్పుడు లేకుండా చరణ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో పెట్టేసుకున్నాడు. అది మరేదో కాదు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎప్పుడో చరణ్కి ఒక లైన్ వినిపించాడు. అతనిప్పుడు జెర్సీ చిత్రాన్ని షాహిద్ కపూర్తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
ఆ సినిమా విడుదలయితే గౌతమ్కి బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే అతడితో చరణ్ సినిమా అంటే హిందీ మార్కెట్ పరంగా ఢోకా వుండదు. ఈ ప్రాజెక్ట్ ఎలాగో ఓకే అయింది కనుకే చరణ్ మిగతా సినిమాల పట్ల ఎక్కువ టెన్షన్ పడడం లేదు. తారక్తో సినిమా తర్వాత తనతో సినిమా చేయాలని త్రివిక్రమ్ని ఆల్రెడీ చరణ్ లాక్ చేసి పెట్టుకున్నాడు.
This post was last modified on December 30, 2020 9:07 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…