రాజమౌళి సినిమా తర్వాత రీజనల్ సినిమా ప్లాన్ చేస్తే ఆ హీరోకి ముందు చూపు లేనట్టే అనుకోవాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్. రిజల్ట్ ఎలా వుంటుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం కానీ దాని తర్వాత ఎన్టీఆర్, చరణ్ చేసే సినిమాలయితే కచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసి తీరతాయి.
త్రివిక్రమ్తో ఆల్రెడీ తన తదుపరి చిత్రాన్ని తారక్ ఎప్పుడో ఓకే చేసేసి పెట్టుకున్నాడు. కానీ చరణ్ మాత్రం ఇంతవరకు తదుపరి చిత్రమేంటనే దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే చప్పుడు లేకుండా చరణ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో పెట్టేసుకున్నాడు. అది మరేదో కాదు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎప్పుడో చరణ్కి ఒక లైన్ వినిపించాడు. అతనిప్పుడు జెర్సీ చిత్రాన్ని షాహిద్ కపూర్తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
ఆ సినిమా విడుదలయితే గౌతమ్కి బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే అతడితో చరణ్ సినిమా అంటే హిందీ మార్కెట్ పరంగా ఢోకా వుండదు. ఈ ప్రాజెక్ట్ ఎలాగో ఓకే అయింది కనుకే చరణ్ మిగతా సినిమాల పట్ల ఎక్కువ టెన్షన్ పడడం లేదు. తారక్తో సినిమా తర్వాత తనతో సినిమా చేయాలని త్రివిక్రమ్ని ఆల్రెడీ చరణ్ లాక్ చేసి పెట్టుకున్నాడు.
This post was last modified on December 30, 2020 9:07 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…