రాజమౌళి సినిమా తర్వాత రీజనల్ సినిమా ప్లాన్ చేస్తే ఆ హీరోకి ముందు చూపు లేనట్టే అనుకోవాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్. రిజల్ట్ ఎలా వుంటుందనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం కానీ దాని తర్వాత ఎన్టీఆర్, చరణ్ చేసే సినిమాలయితే కచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసి తీరతాయి.
త్రివిక్రమ్తో ఆల్రెడీ తన తదుపరి చిత్రాన్ని తారక్ ఎప్పుడో ఓకే చేసేసి పెట్టుకున్నాడు. కానీ చరణ్ మాత్రం ఇంతవరకు తదుపరి చిత్రమేంటనే దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే చప్పుడు లేకుండా చరణ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో పెట్టేసుకున్నాడు. అది మరేదో కాదు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎప్పుడో చరణ్కి ఒక లైన్ వినిపించాడు. అతనిప్పుడు జెర్సీ చిత్రాన్ని షాహిద్ కపూర్తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
ఆ సినిమా విడుదలయితే గౌతమ్కి బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే అతడితో చరణ్ సినిమా అంటే హిందీ మార్కెట్ పరంగా ఢోకా వుండదు. ఈ ప్రాజెక్ట్ ఎలాగో ఓకే అయింది కనుకే చరణ్ మిగతా సినిమాల పట్ల ఎక్కువ టెన్షన్ పడడం లేదు. తారక్తో సినిమా తర్వాత తనతో సినిమా చేయాలని త్రివిక్రమ్ని ఆల్రెడీ చరణ్ లాక్ చేసి పెట్టుకున్నాడు.
This post was last modified on December 30, 2020 9:07 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…