విశ్వక్ సేన్ ప్రతి సినిమాలోను కరకుగా మాట్లాడే మొరటు యువకుడి పాత్రలే చేస్తూ ఒక విధమైన యాంగ్రీ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కుర్రాళ్లలో అతనికి ఫాలోయింగ్ బాగానే వుంది కానీ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అతడి సినిమాలకు అలవాటు పడలేదు. టైప్ కాస్ట్ అయిపోతూ ఒకే మూసలో పడిపోతున్న విశ్వక్ సేన్ రైట్ టైమ్లో రైట్ డెసిషన్ తీసుకున్నాడు.
తమిళంలో విజయవంతమయిన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఆ చిత్రం లైట్ ఎంటర్టైన్మెంట్తో యూత్ని, క్లాస్ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా వుంటుంది. తన జీవితం రాంగ్ ట్రాక్లోకి వెళ్లిపోయిందని చింతించే ఒక యువకుడు లైఫ్లో సెకండ్ చాన్స్ కోరుకుంటాడు. ఈసారి మరో విధంగా జీవితాన్ని బ్రతకాలనుకుంటాడు. కానీ చివరకు తనకు దేవుడు నిర్దేశించినదే అసలైన ఆనందకర జీవితమని తెలుసుకుంటాడు.
ఈ కథను తమిళంలో చాలా వినోదాత్మకంగా తెరకెక్కించడంతో ఆ తమిళ చిత్రం ఓటిటి ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. సదరు చిత్రం గురించి మహేష్ బాబు కూడా ప్రత్యేకించి ట్వీట్ చేసాడు. అర్జున్ రెడ్డి ఇమేజ్ని బ్రేక్ చేసిన గీత గోవిందం మాదిరిగా విశ్వక్ సేన్కి ఈ సినిమా ఇతర వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ దక్కుతుందేమో చూద్దాం.
This post was last modified on December 29, 2020 10:26 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…