విశ్వక్ సేన్ ప్రతి సినిమాలోను కరకుగా మాట్లాడే మొరటు యువకుడి పాత్రలే చేస్తూ ఒక విధమైన యాంగ్రీ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కుర్రాళ్లలో అతనికి ఫాలోయింగ్ బాగానే వుంది కానీ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అతడి సినిమాలకు అలవాటు పడలేదు. టైప్ కాస్ట్ అయిపోతూ ఒకే మూసలో పడిపోతున్న విశ్వక్ సేన్ రైట్ టైమ్లో రైట్ డెసిషన్ తీసుకున్నాడు.
తమిళంలో విజయవంతమయిన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఆ చిత్రం లైట్ ఎంటర్టైన్మెంట్తో యూత్ని, క్లాస్ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా వుంటుంది. తన జీవితం రాంగ్ ట్రాక్లోకి వెళ్లిపోయిందని చింతించే ఒక యువకుడు లైఫ్లో సెకండ్ చాన్స్ కోరుకుంటాడు. ఈసారి మరో విధంగా జీవితాన్ని బ్రతకాలనుకుంటాడు. కానీ చివరకు తనకు దేవుడు నిర్దేశించినదే అసలైన ఆనందకర జీవితమని తెలుసుకుంటాడు.
ఈ కథను తమిళంలో చాలా వినోదాత్మకంగా తెరకెక్కించడంతో ఆ తమిళ చిత్రం ఓటిటి ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. సదరు చిత్రం గురించి మహేష్ బాబు కూడా ప్రత్యేకించి ట్వీట్ చేసాడు. అర్జున్ రెడ్డి ఇమేజ్ని బ్రేక్ చేసిన గీత గోవిందం మాదిరిగా విశ్వక్ సేన్కి ఈ సినిమా ఇతర వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ దక్కుతుందేమో చూద్దాం.
This post was last modified on December 29, 2020 10:26 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…