Movie News

చల్లబడిపోకుండా అభిజీత్‍ జాగ్రత్త

బిగ్‍బాస్‍ కంటెస్టెంట్లను ఎప్పుడూ వేధించే సమస్య ఏమిటంటే… ఒకసారి సీజన్‍ ముగిసిన తర్వాత వాళ్ల గురించి జనం అంతగా పట్టించుకోరు. హౌస్‍లో వున్నంతసేపు రోజూ సోషల్‍ మీడియాలో పడి చర్చలు జరుపుతారు కానీ సీజన్‍ అయిపోయిన తర్వాత వేరే ఎంటర్‍టైన్‍మెంట్‍ వెతుక్కుంటారు. అందుకే బిగ్‍బాస్‍ ముగిసిన కొద్ది వారాలలో అందులో పాల్గొన్నవారు నెమ్మదిగా సైడ్‍లైన్‍ అయిపోతుంటారు.

అయితే తనను జనం మరచిపోకుండా చూసుకోవడమే కాకుండా న్యూస్‍లో కూడా తాను తప్పకుండా వుండేలా అభిజీత్‍ జాగ్రత్తలు పాటిస్తున్నాడు. క్రిస్మస్‍ రోజున శాంటా అవతారమెత్తిన అభిజీత్‍ ఆ తర్వాత తన లైఫ్‍ ఈజ్‍ బ్యూటిఫుల్‍ దర్శకుడు శేఖర్‍ కమ్ములతో పాటు అందులో తనతో పాటు నటించిన సహ నటుడిని కలిసి ఏదో ఒక విధంగా న్యూస్‍లో వుండేలా చూసుకున్నాడు.

అయితే అభిజీత్‍ ఇలాంటి ఫోటో సెషన్లు, చారిటీ కార్యక్రమాలు కాకుండా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ దక్కించుకున్నట్టయితే అందరూ తనగురించి మాట్లాడుకుంటారు. బిగ్‍బాస్‍ గత సీజన్ల విజేతలెవరూ ఆ తర్వాత ఏమంత చేసిందేమీ లేదు. అభిజీత్‍ అయినా ఓటిటి ట్రెండ్‍ని క్యాచప్‍ చేసి హీరోగా మళ్లీ బ్రేక్‍ సాధిస్తాడని అతడికి ఓట్లేసి గెలిపించిన వాళ్లు ఎదురు చూస్తున్నారు.

This post was last modified on December 29, 2020 2:44 pm

Share
Show comments
Published by
Satya
Tags: Abhijeeth

Recent Posts

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

6 minutes ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

53 minutes ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

1 hour ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

3 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

3 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

4 hours ago