పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించిన డైరెక్టర్స్ డేలో ఆయన అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఒక్క పెద్ద సినిమా లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ కృష్ణ, దర్శకరత్న దాసరి నారాయణరావుగారిలా వేగంగా సినిమాలు చేసే ట్రెండ్ మళ్లీ రావాలని, వాళ్ళు ఏడాదికి అయిదు పది సినిమాలు తీసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
నారాయణమూర్తి గారు అన్నది అక్షరాలా పాటించాల్సిన నిజాలు. గత కొన్నేళ్లుగా హీరోలే కాదు ప్యాన్ ఇండియా పేరుతో దర్శకులు కూడా ఒక్క సినిమాకు రెండు మూడు సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. రాజమౌళి అంటే ఆయన గ్రాండియర్స్ వేరే స్థాయిలో ఉంటాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు. మీడియం బడ్జెట్ తో తీసే ఫ్లాప్ డైరెక్టర్లు కూడా ఆఫర్లు ఉన్నా సరే కాలయాపన చేస్తున్న వైనం ఒకరిద్దరి విషయంలో కాదు చాలామందిలో ఓపెన్ గా కనిపిస్తోంది.
పరిశ్రమ పచ్చగా ఉండాలంటే వరసగా సినిమాలు రావాలి. అప్పట్లో దాసరిగారు రోజుకు మూడు నాలుగు షిఫ్టులు అవసరమైనా పని చేసేవాళ్ళు. ఏకకాలంలో మూడు షూటింగులు చేసేవాళ్ళు. అన్ని బాధ్యతలు మోసుకునేవాళ్లు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఒకసారి పద్నాలుగు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఇప్పడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు తదితరులంతా ఏడాదికి ఒక్కటి ఇవ్వడమే అసాధ్యమనేలా మారిపోయారు.
అలాని క్వాలిటీ లేకుండా కంటెంట్స్ ఇవ్వమని కాదు. అలా చేస్తే ఏమవుతుందో గత కొన్నేళ్లలో బాక్సాఫీస్ సాక్షిగా ఎన్నో డిజాస్టర్లు థియేటర్లను ముంచేశాయి. సో నాణ్యతని మిస్ కాకుండానే బెస్ట్ ఇవ్వడానికి అందరూ కష్టపడాలి. కనీసం ఏడాదికి ఒక్కో స్టార్ హీరో ఒక సినిమా ఇచ్చినా చాలు పన్నెండు నెలల థియేటర్ ఫీడింగ్ కి ఢోకా ఉండదు. అలా కాకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తూ ఉంటే ఇప్పటికే తగ్గిపోయిన సింగల్ స్క్రీన్ల మనుగడ మరింత కష్టమవుతుంది.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…