పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించిన డైరెక్టర్స్ డేలో ఆయన అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఒక్క పెద్ద సినిమా లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ కృష్ణ, దర్శకరత్న దాసరి నారాయణరావుగారిలా వేగంగా సినిమాలు చేసే ట్రెండ్ మళ్లీ రావాలని, వాళ్ళు ఏడాదికి అయిదు పది సినిమాలు తీసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
నారాయణమూర్తి గారు అన్నది అక్షరాలా పాటించాల్సిన నిజాలు. గత కొన్నేళ్లుగా హీరోలే కాదు ప్యాన్ ఇండియా పేరుతో దర్శకులు కూడా ఒక్క సినిమాకు రెండు మూడు సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. రాజమౌళి అంటే ఆయన గ్రాండియర్స్ వేరే స్థాయిలో ఉంటాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు. మీడియం బడ్జెట్ తో తీసే ఫ్లాప్ డైరెక్టర్లు కూడా ఆఫర్లు ఉన్నా సరే కాలయాపన చేస్తున్న వైనం ఒకరిద్దరి విషయంలో కాదు చాలామందిలో ఓపెన్ గా కనిపిస్తోంది.
పరిశ్రమ పచ్చగా ఉండాలంటే వరసగా సినిమాలు రావాలి. అప్పట్లో దాసరిగారు రోజుకు మూడు నాలుగు షిఫ్టులు అవసరమైనా పని చేసేవాళ్ళు. ఏకకాలంలో మూడు షూటింగులు చేసేవాళ్ళు. అన్ని బాధ్యతలు మోసుకునేవాళ్లు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఒకసారి పద్నాలుగు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఇప్పడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు తదితరులంతా ఏడాదికి ఒక్కటి ఇవ్వడమే అసాధ్యమనేలా మారిపోయారు.
అలాని క్వాలిటీ లేకుండా కంటెంట్స్ ఇవ్వమని కాదు. అలా చేస్తే ఏమవుతుందో గత కొన్నేళ్లలో బాక్సాఫీస్ సాక్షిగా ఎన్నో డిజాస్టర్లు థియేటర్లను ముంచేశాయి. సో నాణ్యతని మిస్ కాకుండానే బెస్ట్ ఇవ్వడానికి అందరూ కష్టపడాలి. కనీసం ఏడాదికి ఒక్కో స్టార్ హీరో ఒక సినిమా ఇచ్చినా చాలు పన్నెండు నెలల థియేటర్ ఫీడింగ్ కి ఢోకా ఉండదు. అలా కాకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తూ ఉంటే ఇప్పటికే తగ్గిపోయిన సింగల్ స్క్రీన్ల మనుగడ మరింత కష్టమవుతుంది.
This post was last modified on May 5, 2026 10:56 am
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అప్పటికే ప్రేమతో మీ కార్తీక్…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ బాగానే ప్రభావం చూపిస్తాడని చాలామంది అన్నారు కానీ.. మరీ అధికారం చేపట్టే స్థాయిలో తన…