శ్రీ విష్ణు అనే కుర్రాడికి సొంతంగా వచ్చిన గుర్తింపు కంటే.. నారా రోహిత్ ఫ్రెండుగా, అతడి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేసే నటుడిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్లిద్దరికి ఎలా స్నేహం మొదలైందో ఏమో కానీ.. రోహిత్తో కలిసి వరుసగా ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, కథలో రాజకుమారి, ఆటగాళ్లు, వీర భోగ వసంతరాయలు సినిమాల్లో నటించాడు విష్ణు.
వీటిలో విష్ణు లీడ్ రోల్ చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రానికి రోహిత్ నిర్మాత కూడా. ఐతే రోహిత్ ఫామ్లో ఉండగా అతడి ద్వారా అవకాశాలందుకున్న శ్రీ విష్ణు.. నెమ్మదిగా హీరోగా నిలదొక్కుకున్నాడు. కానీ అతను కుదురుకునే సమయానికి రోహిత్ లైమ్ లైట్లోంచి వెళ్లిపోవడం ఆశ్చర్యం. ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో విష్ణు ఒకడు. గత ఏఢాది ‘బ్రోచేవారెవరురా’తో పెద్ద హిట్ కొట్టినప్పటి నుంచి విష్ణు కెరీర్ మంచి ఊపులోకి వచ్చింది.
లాక్ డౌన్ టైంను బాగా ఉపయోగించుకున్న విష్ణు వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే ‘రాజ రాజ చోర’ అనే సినిమాను పూర్తి చేసిన శ్రీవిష్ణు.. ఈ మధ్యే అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘గాలి సంపత్’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అది అంతలోనే ముగింపు దశకు వచ్చేసింది. ఇంతలో ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ లాంటి పేరున్న బేనర్లో ‘జోహార్’ ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమాను ఆరంభించాడు. ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా మరో సినిమా అనౌన్స్ అయింది. ప్రదీప్ వర్మ అల్లూరి అనే కొత్త దర్శకుడితో అతను జట్టు కట్టాడు.
బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే ఇది కూడా సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం విష్ణు చేతిలో ఉన్న నాలుగు సినిమాలూ వచ్చే ఏడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి. విష్ణు ఇంత ఊపులో ఉంటే.. అతడికి లైఫ్ ఇచ్చిన నారా రోహిత్ రెండేళ్లుగా ఏ సినిమా చేయలేదు. అతడి కెరీర్కు ఊహించని విధంగా బ్రేక్ పడింది. మళ్లీ ఎప్పుడతను సినిమా చేస్తాడో కూడా క్లారిటీ లేదు.
This post was last modified on December 30, 2020 12:39 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…