బూతు టచ్ ఉన్న లో బడ్జెట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో దర్శకుడిగా తన ప్రయాణం ఆరంభించాడు దాసరి మారుతి. ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ సినిమాలతో వరుస విజయాలు అందుకుని.. ఆ తర్వాత రూటు మార్చి ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అందిస్తున్నాడతను. ‘భలే భలే..’ తర్వాత మారుతి నుంచి మహానుభావుడు, ప్రతి రోజూ పండగే లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు వచ్చాయి.
తన సినిమాలకు ఆకర్షణీయమైన టైటిళ్లు పెట్టడంలో మారుతి సిద్ధహస్తుడు. టైటిల్ దగ్గర్నుంచి ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు మారుతి. తన కొత్త సినిమాకు మారుతి క్యాచీ టైటిల్ పెట్టినట్లు సమాచారం. కమర్షియల్ సినిమాలు తీయడంలో నిపుణుడైన మారుతి.. తన కొత్త చిత్రానికి ‘పక్కా కమర్షియల్’ అని టైటిల్ పెట్టాడట.
ఈ టైటిల్ చూస్తేనే ఇది మాంచి మాస్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. హీరోలకు తనదైన శైలి క్యారెక్టరైజేషన్లు సెట్ చేసి వాటి ద్వారా ఎంటర్టైన్ చేయడం మారుతి స్టైల్. పక్కా కమర్షియల్ అనే టైటిల్ చూస్తే ఇందులో హీరో బాగా కమర్షియల్ అయి ఉంటాడనిపిస్తోంది. ఈ టైటిల్తో రవితేజ హీరోగా సినిమా తీయాలని మారుతి అనుకున్నాడు. అతడికి మాతృ సంస్థ అనదగ్గ గీతా ఆర్ట్స్లోనే ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఐతే పారితోషకం దగ్గర తేడా వచ్చి రవితేజ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు వార్తలొస్తున్నాయి.
రవితేజ స్థానంలోకి ముందు నాని వస్తాడని ప్రచారం జరగ్గా.. ఆ తర్వాతేమో గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది. ఎక్కువగా సీరియస్ సినిమాలు చేసే గోపీచంద్.. మారుతితో జట్టు కడితే కాంబినేషన్ భిన్నంగానే ఉంటుంది. గోపీచంద్ కూడా మంచి కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్నాడు. అతను ప్రస్తుతం ‘సీటీమార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 28, 2020 6:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…