Movie News

బంగార్రాజు.. మళ్లీ కొత్త పాట


బంగార్రాజు సినిమా గురించి చర్చ ఈనాటిది కాదు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ విడుదలై భారీ విజయం అందుకున్న కొన్ని నెలల నుంచే.. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన బంగార్రాజు బ్యాక్ స్టోరీతో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ స్క్రిప్టు మీద దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల మూడేళ్లకు పైగానే పని చేస్తున్నాడు. కానీ దాన్ని నాగార్జున ఓ పట్టాన ఓకే చేయట్లేదు. ఈ సినిమా చేయడం పక్కా, అది కూడా సొంత బేనర్లోనే అంటున్నాడే తప్ప.. స్క్రిప్టుకు ఆమోద ముద్ర వేసి షూటింగ్ మాత్రం మొదలుపెట్టట్లేదు.

‘బంగార్రాజు’ స్క్రిప్టు ఓకే అయిందని, ఇక షూటింగే మొదలు కావడమే ఆలస్యం అని వార్తలు రావడం.. ఆ తర్వాత బ్రేక్ పడటం .. ఇలా చాలాసార్లు జరిగింది ఇప్పటికే. దీంతో ‘బంగార్రాజు’ వార్తలపై జనాలకు కూడా ఆసక్తి సన్నగిల్లిపోయింది. మొదలైనపుడు చూసుకుందాంలే అన్నట్లు లైట్ తీసుకుంటున్నారు.

ఐతే అక్కినేని వారి కాంపౌండ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఎట్టకేలకు 2021 ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కబోతోందట. నాగార్జున ఇటీవలే స్క్రిప్టు లాక్ చేయించారని.. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని.. సంక్రాంతి తర్వాత ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. నాగ్ ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ సినిమాను పూర్తి చేసి ‘బిగ్ బాస్’ పని కూడా ముగించి ఖాళీ అయ్యారు. ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ.. అదెప్పుడన్నదానిపై క్లారిటీ లేదు. ఈలోపు ఆయన ‘బంగార్రాజు’ను పట్టాలెక్కిస్తున్నట్లు చెబుతున్నారు.

స్క్రిప్టు ఓకే అయిపోవడంతో కళ్యాణ్ సంగీత దర్శకుడు అనూప్‌తో కలిసి సంగీత చర్చలు కూడా జరుపుతున్నాడట. ‘సోగ్గాడే..’కు అతనందించిన సంగీతం పెద్ద ప్లస్ అయిన సంగతి తెలిసిందే. అంతా ఓకే అనుకుంటే ఈ చిత్రంలో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశాలున్నాయి. రమ్యకృష్ణ పాత్ర ఇందులోనూ కొనసాగుతుందట.

This post was last modified on December 28, 2020 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతి పరీక్ష పాస్ అవ్వాలి జగన్

గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క…

15 minutes ago

చాక్లెట్ లుక్‌లో కియారా… సోషల్ మీడియా షేక్

​బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పెళ్లి, ఆ తర్వాత పాప…

22 minutes ago

దేశంలో ఫ‌స్ట్‌.. గుడ్డుతోపాటు చేప‌లు కూడా!

చిన్నారుల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అందించే మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఇక నుంచి చేప‌ల కూర కూడా వ‌చ్చించ‌నున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి…

36 minutes ago

కుప్పంలో భువ‌నేశ్వ‌రి సైలెంట్ `టూర్స్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం.. తిరుప‌తిలోని కుప్పంలో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్‌గా చుట్టేస్తున్నారు. ప్ర‌తి రెండు…

2 hours ago

ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది

అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన…

2 hours ago

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…

3 hours ago