బంగార్రాజు సినిమా గురించి చర్చ ఈనాటిది కాదు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ విడుదలై భారీ విజయం అందుకున్న కొన్ని నెలల నుంచే.. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన బంగార్రాజు బ్యాక్ స్టోరీతో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ స్క్రిప్టు మీద దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల మూడేళ్లకు పైగానే పని చేస్తున్నాడు. కానీ దాన్ని నాగార్జున ఓ పట్టాన ఓకే చేయట్లేదు. ఈ సినిమా చేయడం పక్కా, అది కూడా సొంత బేనర్లోనే అంటున్నాడే తప్ప.. స్క్రిప్టుకు ఆమోద ముద్ర వేసి షూటింగ్ మాత్రం మొదలుపెట్టట్లేదు.
‘బంగార్రాజు’ స్క్రిప్టు ఓకే అయిందని, ఇక షూటింగే మొదలు కావడమే ఆలస్యం అని వార్తలు రావడం.. ఆ తర్వాత బ్రేక్ పడటం .. ఇలా చాలాసార్లు జరిగింది ఇప్పటికే. దీంతో ‘బంగార్రాజు’ వార్తలపై జనాలకు కూడా ఆసక్తి సన్నగిల్లిపోయింది. మొదలైనపుడు చూసుకుందాంలే అన్నట్లు లైట్ తీసుకుంటున్నారు.
ఐతే అక్కినేని వారి కాంపౌండ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఎట్టకేలకు 2021 ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కబోతోందట. నాగార్జున ఇటీవలే స్క్రిప్టు లాక్ చేయించారని.. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని.. సంక్రాంతి తర్వాత ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. నాగ్ ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ సినిమాను పూర్తి చేసి ‘బిగ్ బాస్’ పని కూడా ముగించి ఖాళీ అయ్యారు. ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ.. అదెప్పుడన్నదానిపై క్లారిటీ లేదు. ఈలోపు ఆయన ‘బంగార్రాజు’ను పట్టాలెక్కిస్తున్నట్లు చెబుతున్నారు.
స్క్రిప్టు ఓకే అయిపోవడంతో కళ్యాణ్ సంగీత దర్శకుడు అనూప్తో కలిసి సంగీత చర్చలు కూడా జరుపుతున్నాడట. ‘సోగ్గాడే..’కు అతనందించిన సంగీతం పెద్ద ప్లస్ అయిన సంగతి తెలిసిందే. అంతా ఓకే అనుకుంటే ఈ చిత్రంలో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశాలున్నాయి. రమ్యకృష్ణ పాత్ర ఇందులోనూ కొనసాగుతుందట.
This post was last modified on December 28, 2020 10:52 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…