సినిమా వాళ్లకేంటండీ బాబూ.. కోట్లల్లో పారితోషకాలు, రాజభోగాలు అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ వైభవం కొంతమందికే పరిమితం. ఇక్కడ మెజారిటీ జనాల పరిస్థితి దయనీయం. నిరంతరం అనిశ్చితితో బతికే సినీ ఆర్టిస్టులు, కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
లాక్ డౌన్ వల్ల ఇలాంటి వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో చెబుతూ బెంగాలీ టీవీ ఆర్టిస్టు సులఘ్న ఛటర్జీ ఒక వీడియోను రూపొందించింది. అది చూస్తే సినిమా వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఆమె ఈ వీడియోలో ఏమీ మాట్లాడకుండా కేవలం ప్లకార్డుల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్ల కష్టాల గురించి హృద్యంగా చెప్పింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.
‘‘నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తా. ప్రభుత్వానికి అత్యధిక పన్ను చెల్లించే రంగాల్లో ఇదొకటి. లాక్ డౌన్ టైంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నది మేమే. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెగ్యులర్గా పని ఉండదు. సమయానికి చెల్లింపులూ ఉండవు. చేతికి పని దొరికితే నోటికి తిండి.. మాలో చాలామంది పరిస్థితి ఇదే. మాకందరికీ 2 నెలలుగా పని లేదు. ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయం నుంచే పని దొరకట్లేదు. అన్ని ఆఫీసులూ మూతబడి ఉండటంతో పాత బకాయిలు చెల్లించలేదు.
మేం ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ నగరాల్లో ఉండాలి. మా లైఫ్ స్టైల్ కూడా రిచ్గా ఉండక తప్పని పరిస్థితి. మమ్మల్ని వలస కార్మికులుగా పరిగణించరు కాబట్టి మా స్వస్థలాలకు వెళ్లలేం. లాక్ డౌన్ ముగిసినా కొన్ని నెలల పాటు మాకు పనులు దొరకవు. రెగ్యులర్ ఖర్చులతో పాటు అప్పులు కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. మాకు ఫిక్స్డ్ శాలరీ ఉండదు. పీఎఫ్, గ్యాట్యుటీ లాంటివేమీ ఉండవు. ఒక్కో ప్రాజెక్ట్ మేర పని చేస్తాం. క్రమం తప్పకుండా పని ఉండదు. సమయానికి చెల్లింపులూ ఉండవు. ఏ విపత్తు వచ్చినా మేం అండగా నిలిచే ప్రయత్నం చేస్తాం. కానీ మాకు కష్టం వస్తే ఎవ్వరూ అండగా నిలవరు. మా బాధల గురించి ఎవరూ మాట్లాడరు, పట్టించుకోరు’’ అంటూ సినీ జనాల కష్టాల్ని చెప్పుకొచ్చింది సులఘ్న. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on May 5, 2020 12:12 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…