ఒక భాష నుంచి ఆల్ టైమ్ హిట్ వస్తే.. ఆ ఇండస్ట్రీ అందుకు ఎంతో గర్విస్తుంది. ఆ సినిమా మాది అని గర్వంగా చెప్పుకుంటుంది. ‘బాహుబలి’ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ టాలీవుడ్ అలాగే గర్వించింది. ‘కేజీఎఫ్’ సినిమా సంచలనం రేపినపుడు శాండిల్వుడ్ కూడా అంతే ప్రౌడ్ ఫీలైంది. కానీ ‘దురంధర్’, ‘దురంధర్-2’ చిత్రాల విషయంలో మాత్రం బాలీవుడ్లో అలాంటి ఫీలింగ్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. నాలుగు నెలల ముందు ‘దురంధర్’ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.
గత నెలలో విడుదలైన ‘దురంధర్-2’ అంతకుమించి విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం బాహుబలి, పుష్ప-2 చిత్రాలను అధిగమించి ఆల్ టైం ఇండియన్ టాప్-2 గ్రాసర్గా నిలిచింది. అయినా బాలీవుడ్ నుంచి ఆ చిత్రాన్ని అభినందిస్తూ బాలీవుడ్ ప్రముఖులు పోస్టులు పెట్టట్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు అనుకూలంగా తీశారు అనే ఒక ముద్ర వేసి బాలీవుడ్ ఆ సినిమాకు దూరంగా జరుగుతోందనే అభిప్రాయం కలుగుతోంది.
ఇలాంటి సమయంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన కునాల్ కోహ్లి.. ‘దురంధర్’ విషయంలో బాలీవుడ్ అగ్ర దర్శకుల కడుపు మంట ఎలా ఉందో బయటపెట్టారు. ‘దురంధర్’, ‘దురంధర్-2’ సినిమాలు సాధించిన విజయానికి గర్వించకపోగా.. ఆ సినిమా ఫ్లాప్ కావాలని బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కోరుకున్నట్లు ఆమిర్ ఖాన్తో ‘ఫనా’ సినిమా తీసిన కునాల్ వెల్లడించాడు.
ఇండస్ట్రీలో ఎవ్వరూ ‘దురంధర్’ సినిమాకు మద్దతుగా నిలవలేదని.. అయినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని వ్యాఖ్యానించాడు కునాల్. తాను కొంతమంది అగ్ర దర్శకులతో మాట్లాడానని.. వాళ్లు సోమవారానికి ఈ సినిమా పనైపోతుందని అన్నారని, కానీ ఆ సినిమా సోమవారం పడిపోకుండా బాగా ఆడిందని అన్నాడు.
సన్నీ డియోల్ సినిమా ‘బోర్డర్-2’ సినిమా కూడా ఫ్లాప్ కావాలని చాలామంది కోరుకున్నారని.. కానీ ఆ చిత్రం రూ.300 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాడు. దీన్ని బట్టి తాను చెప్పదలుచుకున్నది ఒక్కటే అని.. ఇండస్ట్రీ సపోర్ట్ చేసినా చేయకపోయినా పెద్ద విషయం కాదని.. సినిమాలు ఆడతాయని అతనన్నాడు.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…