Movie News

దాసరికి చిరు మార్కు ఎలివేషన్

తెలుగు సినీ రంగంలో మరే దర్శకుడూ అందుకోని స్థాయికి చేరుకున్న వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణ రావు. గొప్ప సినిమాలు చాలామంది తీస్తారు. తిరుగులేని విజయాలూ అందుకుంటారు. కానీ మరణానంతరం తాము తీసిన సినిమాల ద్వారానే కాక.. వ్యక్తిగా కూడా జనాల గుండెల్లో నిలిచిపోయే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన కోవకు చెందిన వారే దాసరి నారాయణరావు.

సినిమాలు తగ్గించేశాక పరిశ్రమ పెద్దగా ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పరిశ్రమలో ఎవరికే కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆయన ముందు నిలబడేవారు. ఏ సమస్య తలెత్తినా.. పెద్ద మనిషిలా వ్యవహరించి పరిష్కరించేవారు. ఎప్పుడూ పరిశ్రమకు మంచి జరిగే విషయాల మీదే ఆయన దృష్టి ఉండేది. ఒక వ్యక్తి మరణానంతరం.. ‘ఆయన లేకపోవడం పెద్ద లోటు’ అని అంటుంటారు. ఈ మాట నూటికి నూరు శాతం నిజం అనిపించింది దాసరి విషయంలోనే.

దాసరి వెళ్లిపోగానే టాలీవుడ్లో ఒక శూన్యత ఏర్పడింది. ఆయన లేని లోటు చాలా కాలం వెంటాడింది. మెగాస్టార్ చిరంజీవి కొంత మేర ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాసరి మీద చిరుకు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సోమవారం దాసరి జయంతి సందర్భంగా ఆయన మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు చిరు.

దా.. స..రి అనే అక్షరాలకు ఆయన ఇచ్చిన అబ్రివేషన్ చాలా ప్రత్యేకమైందే. ‘‘(దా)నంలో కర్ణుడు మీరు.. (స)మర్థతలో అర్జునుడు మీరు.. (రి)పువర్గమే లేని ధర్మరాజు మీరు.. మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. ప్రతి భావి దర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది’’ అంటూ దాసరితో కలిసి చివరగా పాల్గొన్న ప్రెస్ మీట్ తాలూకు ఫొటోను పంచుకుని తన గురువుకు నివాళి అర్పించాడు చిరు. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఈ రోజు దాసరిని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.

This post was last modified on May 4, 2020 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

27 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago