తెలుగు సినీ రంగంలో మరే దర్శకుడూ అందుకోని స్థాయికి చేరుకున్న వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణ రావు. గొప్ప సినిమాలు చాలామంది తీస్తారు. తిరుగులేని విజయాలూ అందుకుంటారు. కానీ మరణానంతరం తాము తీసిన సినిమాల ద్వారానే కాక.. వ్యక్తిగా కూడా జనాల గుండెల్లో నిలిచిపోయే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన కోవకు చెందిన వారే దాసరి నారాయణరావు.
సినిమాలు తగ్గించేశాక పరిశ్రమ పెద్దగా ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పరిశ్రమలో ఎవరికే కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆయన ముందు నిలబడేవారు. ఏ సమస్య తలెత్తినా.. పెద్ద మనిషిలా వ్యవహరించి పరిష్కరించేవారు. ఎప్పుడూ పరిశ్రమకు మంచి జరిగే విషయాల మీదే ఆయన దృష్టి ఉండేది. ఒక వ్యక్తి మరణానంతరం.. ‘ఆయన లేకపోవడం పెద్ద లోటు’ అని అంటుంటారు. ఈ మాట నూటికి నూరు శాతం నిజం అనిపించింది దాసరి విషయంలోనే.
దాసరి వెళ్లిపోగానే టాలీవుడ్లో ఒక శూన్యత ఏర్పడింది. ఆయన లేని లోటు చాలా కాలం వెంటాడింది. మెగాస్టార్ చిరంజీవి కొంత మేర ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాసరి మీద చిరుకు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సోమవారం దాసరి జయంతి సందర్భంగా ఆయన మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు చిరు.
దా.. స..రి అనే అక్షరాలకు ఆయన ఇచ్చిన అబ్రివేషన్ చాలా ప్రత్యేకమైందే. ‘‘(దా)నంలో కర్ణుడు మీరు.. (స)మర్థతలో అర్జునుడు మీరు.. (రి)పువర్గమే లేని ధర్మరాజు మీరు.. మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. ప్రతి భావి దర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది’’ అంటూ దాసరితో కలిసి చివరగా పాల్గొన్న ప్రెస్ మీట్ తాలూకు ఫొటోను పంచుకుని తన గురువుకు నివాళి అర్పించాడు చిరు. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఈ రోజు దాసరిని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.
This post was last modified on May 4, 2020 3:39 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…