వీర శంకర్ గుర్తున్నాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో గుడుంబా శంకర్ లాంటి భారీ చిత్రం తీసిన దర్శకుడతను. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అతను అడ్రస్ లేకుండా పోయాడు. నిజానికి గుడుంబా శంకర్ కంటే ముందు కూడా వీరశంకర్ లైమ్ లైట్లో లేడు. అప్పుడెప్పుడో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన హలో ఐ లవ్యూ సినిమాతో అతను దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ప్రేమ కోసం, విజయరామరాజు లాంటి సినిమాలు తీశాడు.
పవన్ కళ్యాణ్ అనుకోకుండా టీవీలో హలో ఐ లవ్యూ సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయి వీర శంకర్ను పిలిపించుకుని గుడుంబా శంకర్ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా రైటింగ్, మేకింగ్లో పవన్దే కీ రోల్ కాగా.. వీరశంకర్ దర్శకుడిగా ఉన్నాడు.
ఐతే గుడుంబా శంకర్కు మంచి హైప్ అయితే వచ్చింది కానీ.. సినిమా ఆడలేదు. దీంతో వీర శంకర్ మళ్లీ కనుమరుగైపోయాడు. కన్నడలో రెండు సినిమాలు తీసిన వీరశంకర్.. తెలుగులోనూ ఏవో రెండు చిన్న సినిమాలు తీశాడు. ఇప్పుడతను.. ఓ కొత్త సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఆ చిత్రం పేరు.. గంధర్వ.
ఇందులో వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాల కథానాయకుడు సందీప్ మాధవ్ హీరోగా నటించనున్నాడు. అప్సర్ హుసేన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఎం.ఎన్.మధు ఈ చిత్రానికి నిర్మాత. థియేటర్ ఫీల్డ్ నుంచి వచ్చిన సందీప్.. వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాలతో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఐతే ఆ సినిమాలే అనుకున్నంతగా ఆడలేదు. గంధర్వతో అయినా అతను తొలి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. ఈ సినిమాతో వీర శంకర్ ఎలాంటి ముద్ర వేస్తాడో మరి.
This post was last modified on December 27, 2020 10:24 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…