టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చినన్ని ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్బస్టర్లు మరే హీరో ఇవ్వలేదు అంటే అతిశయోక్తి కాదు. ఖైదీతో మొదలుపెడితే తర్వాతి రెండు మూడు దశాబ్దాల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ను రూల్ చేశాడు మెగాస్టార్. ఆయన కెరీర్లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. అందులో ప్రస్తుత తరం హీరోలకు ఏవి సెట్ అవుతాయో చెబుతూ సమంత నిర్వహిస్తున్న సామ్ జామ్ కార్యక్రమంలో మెగాస్టార్ వెల్లడించిన అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తించాయి.
మీ కెరీర్లో మరపురాని సినిమాలను రీమేక్ చేస్తే ప్రస్తుత తరం హీరోల్లో దేనికి ఎవరైతే బాగుంటుందని సమంత అడిగితే చిరు సమాధానం ఇచ్చాడు. గ్యాంగ్ లీడర్ సినిమాకు తన కొడుకు రామ్ చరణ్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగుంటాడని చిరు అభిప్రాయపడటం విశేషం.
ఇక ఇంద్ర సినిమాకు అయితే ప్రస్తుత కథానాయకుల్లో ప్రభాస్ పర్ఫెక్ట్ అని చిరు చెప్పాడు. సామాజిక అంశాలతో ముడిపడ్డ ఠాగూర్ సినిమాకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటాడని చిరు అన్నాడు. ఇక ఛాలెంజ్ సినిమాకు చిరు ఆసక్తికరమైన పేర్లు చెప్పాడు. అల్లు అర్జున్తో పాటు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాకు సరిపోతాడన్నాడు. తన సినిమాల్లో మాంచి ఎంటర్టైనర్ అయిన రౌడీ అల్లుడు సినిమాకు మాస్ రాజా రవితేజ పేరును చిరు సూచించడం విశేషం. ఆ సినిమాను బన్నీ చేసినా బాగుంటుందని అన్నాడు.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు తన కొడుకు రామ్ చరణ్ మాత్రమే కాక మహేష్ బాబు కూడా బాగుంటాడని అభిప్రాయపడ్డాడు. స్వయంకృషి సినిమాను రీమేక్ చేస్తే మాత్రం మళ్లీ తానే అందులో నటించాలని చిరు చెప్పడం విశేషం. విజేత సినిమాకు నాగచైతన్య పేరును చిరు సూచించాడు.
This post was last modified on December 27, 2020 10:11 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…