టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చినన్ని ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్బస్టర్లు మరే హీరో ఇవ్వలేదు అంటే అతిశయోక్తి కాదు. ఖైదీతో మొదలుపెడితే తర్వాతి రెండు మూడు దశాబ్దాల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ను రూల్ చేశాడు మెగాస్టార్. ఆయన కెరీర్లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. అందులో ప్రస్తుత తరం హీరోలకు ఏవి సెట్ అవుతాయో చెబుతూ సమంత నిర్వహిస్తున్న సామ్ జామ్ కార్యక్రమంలో మెగాస్టార్ వెల్లడించిన అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తించాయి.
మీ కెరీర్లో మరపురాని సినిమాలను రీమేక్ చేస్తే ప్రస్తుత తరం హీరోల్లో దేనికి ఎవరైతే బాగుంటుందని సమంత అడిగితే చిరు సమాధానం ఇచ్చాడు. గ్యాంగ్ లీడర్ సినిమాకు తన కొడుకు రామ్ చరణ్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగుంటాడని చిరు అభిప్రాయపడటం విశేషం.
ఇక ఇంద్ర సినిమాకు అయితే ప్రస్తుత కథానాయకుల్లో ప్రభాస్ పర్ఫెక్ట్ అని చిరు చెప్పాడు. సామాజిక అంశాలతో ముడిపడ్డ ఠాగూర్ సినిమాకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటాడని చిరు అన్నాడు. ఇక ఛాలెంజ్ సినిమాకు చిరు ఆసక్తికరమైన పేర్లు చెప్పాడు. అల్లు అర్జున్తో పాటు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాకు సరిపోతాడన్నాడు. తన సినిమాల్లో మాంచి ఎంటర్టైనర్ అయిన రౌడీ అల్లుడు సినిమాకు మాస్ రాజా రవితేజ పేరును చిరు సూచించడం విశేషం. ఆ సినిమాను బన్నీ చేసినా బాగుంటుందని అన్నాడు.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు తన కొడుకు రామ్ చరణ్ మాత్రమే కాక మహేష్ బాబు కూడా బాగుంటాడని అభిప్రాయపడ్డాడు. స్వయంకృషి సినిమాను రీమేక్ చేస్తే మాత్రం మళ్లీ తానే అందులో నటించాలని చిరు చెప్పడం విశేషం. విజేత సినిమాకు నాగచైతన్య పేరును చిరు సూచించాడు.
This post was last modified on December 27, 2020 10:11 am
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…