ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒక థియేటర్కు వెళ్లి.. సామాన్య జనం మధ్య సినిమా చూడడం అరుదైన విషయమే. సాధారణంగా సెలబ్రెటీలు.. తమ హోం థియేటర్లలో స్పెషల్ షో వేయించుకుని సినిమా చూస్తారు. కానీ ప్రభాస్ మాత్రం హైదరాబాద్ కోకాపేటలోని అల్లు సినిమాస్కు వెళ్లి ‘దురంధర్-2’ సినిమా చూశాడు.
తనతో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సైతం వెంట ఉన్నాడు. ఇద్దరూ కలిసి ‘దురంధర్-2’ థియేటర్లో ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. ప్రభాస్ ఇలా వచ్చి సినిమా చూడడం తన సింప్లిసిటీని తెలియజేసేదే. కానీ దీని వెనుక సందీప్ రెడ్డికి వేరే ప్లానింగ్ ఉందనే చర్చ జరుగుతోంది. అతను ఉద్దేశపూర్వకంగానే ప్రభాస్ను తీసుకెళ్లి థియేటర్లో పబ్లిక్ మధ్య సినిమా చూపించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ చివరి చిత్రం ‘రాజాసాబ్’ ఎంతగా విమర్శల పాలైందో తెలిసిందే. అందులో ప్రభాస్ చాలా వరకు డూప్ల మీద ఆధారపడడం.. పెర్ఫామెన్స్ మీద దృష్టిపెట్టకపోవడం మీద సొంత అభిమానులే పెదవి విరిచారు. ‘బాహుబలి’ తర్వాత చాలా వరకు ప్రభాస్ సినిమాల్లో లుక్స్, పెర్ఫామెన్స్ ఆశించిన స్థాయిలో లేవన్నది వాస్తవం.
అతను కష్టపడడం మానేశాడు.. ఫోకస్ తగ్గింది అన్న విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘దురంధర్’లో రణ్వీర్ సింగ్ చూపించిన అంకితభావం, తన ఇంటెన్స్ పెర్ఫామెన్స్, లుక్స్ కోసం పడ్డ కష్టం ఎలాంటిదో చూపించడానికే సందీప్ రెడ్డి తనకీ సినిమా చూపించి ఉండచ్చని భావిస్తున్నారు.
This post was last modified on April 9, 2026 9:27 pm
నిజమేనండోయ్... భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా…
చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన…
వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్…
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.…
రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. లవ్ టుడే, డ్రాగన్,…