థియేటర్లను పునర్నిర్మించాల్సి వచ్చినపుడు.. కొత్తగా ఏదైనా సొబగులు అద్దాలనుకున్నపుడు ఆయా థియేటర్లను తాత్కాలికంగా కొంత కాలం మూసి ఉంచడం జరుగుతుంది తప్ప.. ఒకే సమయంలో మొత్తం అన్ని థియేటర్లనూ నెలల తరబడి మూసి వేసి సినిమాల ప్రదర్శన ఆపేయడం ఇంతకుముందెన్నడూ చూడనిది. వరదలు, సమ్మెలు జరిగినపుడు కూడా ఒకట్రెండు షోలు ఆపేసి మళ్లీ సినిమాలు నడిపిస్తుంటారు. అలాంటిది ఏకంగా తొమ్మిది నెలల పాటు థియేటర్లను మూసి ఉంచడం అన్నది ఊహకందని విషయం.
కరోనా పుణ్యమా అని ఈ వైపరీత్యం చోటు చేసుకుంది. కొన్ని వారాలు అనుకున్న లాక్ డౌన్ను నెలల తరబడి కొనసాగించి.. తర్వాత సడలింపులు ఇచ్చినా సరే థియటర్లను మినహాయిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఎట్టకేలకు అక్టోబరులో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులిచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థియేటర్లు తెరుచుకోవడానికి చాలా సమయం పట్టేసింది. అవి పూర్తి స్థాయిలో మొదలైంది ఈ రోజు, అంటే డిసెంబరు 25న.
‘సోలో బ్రతుకే సో బెటర్’ లాంటి కాస్త పేరున్న కొత్త సినిమా విుడదల కావడంతో చాలా థియేటర్ల బూజు దులిపి ముస్తాబు చేశారు. మల్లీప్టెక్సులు ముందే తెరుచుకున్నప్పటికీ.. ఇప్పటిదాకా డల్లుగానే నడిచాయి. ఈ సినిమాతో మళ్లీ వాటికి కళ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్.. హౌస్ ఫుల్స్ లాంటి మాటలు సుదీర్ఘ విరామం తర్వాత వినిపించాయి. తొమ్మిది నెలలకు పైగా జీవం కోల్పోయిన తెరలకు మళ్లీ కళ వచ్చింది. థియేటర్లు తెరుచుకుంటే.. మంచి సినిమా వస్తే వెళ్లి సినిమా చూడాలని ఎప్పట్నుంచో అనుకుంటున్న ప్రేక్షకులు కూడా ఎట్టకేలకు కదిలారు.
ఇంతకాలం ఉపాధి, ఆదాయం కోల్పోయిన థియేటర్ కార్మికులు, యజమానులకు మళ్లీ ఉత్సాహం వచ్చింది. పార్కింగ్స్ ఫుల్ అయ్యాయి. హాళ్లు నిండాయి. క్యాంటీన్లలో సండిది నెలకొంది. ఇక థియేటర్ హాళ్ల లోపల వాతావరణం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రసాద్ మల్టీప్లెక్స్ సహా చాలా థియేటర్లు ‘వెల్కమ్ బ్యాక్’ అంటూ ప్రేక్షకులతో తమ ఉద్వేగాన్ని పంచుకున్నాయి. ఇక సినిమా టైటిల్స్ పడేటపుడు అందరిలోనూ ఒక ఎగ్జైట్మెంట్ కనిపించింది. అది స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ఎంతోమంది షేర్ చేస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’కు టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ.. ఈ రోజుకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మాత్రం ఈ సినిమానే. అందుకే జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది.
This post was last modified on December 25, 2020 5:47 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…