సోషల్ మీడియాలో కొన్ని టాపిక్స్ విపరీతమైన డిస్కషన్ కు నోచుకుంటున్నాయి. వాటిలో మొదటిది పెద్ది పోస్ట్ పోన్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచమంతా కోడై కూస్తున్నా నిర్మాణ సంస్థ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉండటంతో అభిమానుల్లో అసహనం వ్యక్తమవుతోంది. అయితే కొత్త డేట్ నిర్ణయించడం అనేది హఠాత్తుగా తీసుకునేది కాదు. దాని వెనుక ఎన్నో క్యాలికులేషన్లు చేసుకోవాలి. రెండు తేదీలు మారాయి కాబట్టి ఈసారి తొందరపడే ఛాన్స్ ఎంత మాత్రం లేదు.
సో అభిమానుల ఆశ నిరాశల సంగతి ఎలా ఉన్నా పెద్ది మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. ఇతర నిర్మాతలు ఇప్పుడు ఆఘమేఘాల మీద తమ సినిమాలను అదే డేట్ కి వదిలే సాధ్యాసాద్యాల గురించి ఎనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా వీడియో కంటెంట్ వస్తుందేమోనని బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే టైటిల్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ తప్ప ఇంకెలాంటి అప్డేట్ ఉండకపోవచ్చని విశ్వసనీయ సమాచారం.
అదే జరిగితే ఇది కూడా కొంచెం అసంతృప్తి కలిగించేదే అవుతుంది. దీని గురించి ఎక్కువ హైలైట్ కాకూడనేమో కాబోలు రేసు గుర్రం రీ రిలీజ్ గురించి ఎక్స్, ఇన్స్ టాలో తెగ హడావిడి చేస్తున్నారు. బన్నీ పుట్టినరోజు కానుకని ఘనంగా దాంతో థియేటర్లలో సెలెబ్రేట్ చేసుకుందామని పిలుపు ఇస్తున్నారు. మొన్న మగధీర స్పెషల్ షోలలో పెద్ది పాటలు, టీజర్లు ఎంజాయ్ చేసినట్టు బన్నీ అభిమానులు రేసు గుర్రంలో ఏఏ 22 వీడియోని ఆస్వాదించే అవకాశం రాకపోవచ్చు.
షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉండటంతో టీజర్ విషయంలో దర్శకుడు అట్లీ హడావిడి పడదలుచుకోలేదట. ఐకాన్ స్టార్ కూడా దానికి మద్దతు ఇవ్వడంతో టీజర్ ప్లాన్ డ్రాప్ అయ్యారని అంటున్నారు. వచ్చే ఏడాది ఎప్పుడు సినిమాని రిలీజ్ చేయాలనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల విషయంలో తొందరపాటు వద్దనేది టీమ్ నిర్ణయంగా కనిపిస్తోంది. చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2తో పాటు ఏఏ 22 టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో సన్ పిక్చర్స్ ఉందట.
This post was last modified on March 30, 2026 8:15 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…