బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలె రోజు విజేత అభిజీత్, రన్నరప్ అఖిల్లను మించి హైలైట్ అయ్యాడు మూడో స్థానంలో నిలిచిన సోహెల్. టైటిల్ రేసు నుంచి తప్పుకుని, రూ.25 లక్షలు తీసుకుని మూడో స్థానంతో అతను సంతృప్తి చెందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తన ప్రైజ్ మనీలో రూ.10 లక్షల మొత్తాన్ని అనాథాశ్రమానికి ఇచ్చేస్తానని ప్రకటన చేయడం.. ఆ మొత్తం నాగార్జున ఇవ్వడానికి ముందుక రావడం.. బహుమతి ప్రదానోత్సవానికి వచ్చిన చిరంజీవి సోహెల్కు తిరుగులేని సపోర్ట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఆ సందర్భంగా తాను ఓ సినిమా చేస్తానని.. దానికి చిరంజీవి అండగా నిలవాలని సోహెల్ కోరడం.. చిరు అవసరమైతే తాను ఆ సినిమాలో ఒక క్యామియో కూడా చేస్తాననడం తెలిసిన సంగతే.
ఐతే చిరు అలా హామీ ఇవ్వడంతో సోహెల్ ఏమాత్రం ఆగుతున్నట్లు కనిపించడం లేదు. హౌస్ నుంచి బయటికి వచ్చి నాలుగు రోజులు గడవకముందే అతను హీరోగా కొత్త సినిమా అనౌన్స్ కావడం విశేషం. శ్రీనివాస్ వింజంపాటి అనే కొత్త దర్శకుడు సోహెల్ హీరోగా సినిమా రూపొందించనున్నాడు. జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ సినిమా ఫేమ్ అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఓవైపు బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ సైతం ఇప్పటిదాకా తన కొత్త ప్రాజెక్టుల గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు. అతను ఇంతకుముందు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సహా కొన్ని సినిమాలు చేశాడు. మధ్యలో కెరీర్ ఆగిపోయింది. ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. ఈలోపే ‘బిగ్ బాస్’లో మూడో స్థానం సాధించిన, ఇంకా తెరంగేట్రం కూడా చేయని సోహెల్ హీరోగా సినిమా అనౌన్స్ కావడం విశేషమే. తనకు ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపును ఏమాత్రం వృథా చేయకుండా సోహెల్ భలేగా ఉపయోగించుకుంటున్నాడే అని అతడి అభిమానులు అనుకుంటున్నారు. సోహెల్ హీరోగా సినిమాకు రెడీ అయిపోతున్నాడు మరి చిరు అందులో క్యామియో చేయడానికి సిద్ధమేనా అన్నది ఇక్కడ ప్రశ్న.
This post was last modified on December 24, 2020 3:32 pm
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…