బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలె రోజు విజేత అభిజీత్, రన్నరప్ అఖిల్లను మించి హైలైట్ అయ్యాడు మూడో స్థానంలో నిలిచిన సోహెల్. టైటిల్ రేసు నుంచి తప్పుకుని, రూ.25 లక్షలు తీసుకుని మూడో స్థానంతో అతను సంతృప్తి చెందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తన ప్రైజ్ మనీలో రూ.10 లక్షల మొత్తాన్ని అనాథాశ్రమానికి ఇచ్చేస్తానని ప్రకటన చేయడం.. ఆ మొత్తం నాగార్జున ఇవ్వడానికి ముందుక రావడం.. బహుమతి ప్రదానోత్సవానికి వచ్చిన చిరంజీవి సోహెల్కు తిరుగులేని సపోర్ట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఆ సందర్భంగా తాను ఓ సినిమా చేస్తానని.. దానికి చిరంజీవి అండగా నిలవాలని సోహెల్ కోరడం.. చిరు అవసరమైతే తాను ఆ సినిమాలో ఒక క్యామియో కూడా చేస్తాననడం తెలిసిన సంగతే.
ఐతే చిరు అలా హామీ ఇవ్వడంతో సోహెల్ ఏమాత్రం ఆగుతున్నట్లు కనిపించడం లేదు. హౌస్ నుంచి బయటికి వచ్చి నాలుగు రోజులు గడవకముందే అతను హీరోగా కొత్త సినిమా అనౌన్స్ కావడం విశేషం. శ్రీనివాస్ వింజంపాటి అనే కొత్త దర్శకుడు సోహెల్ హీరోగా సినిమా రూపొందించనున్నాడు. జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ సినిమా ఫేమ్ అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఓవైపు బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ సైతం ఇప్పటిదాకా తన కొత్త ప్రాజెక్టుల గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు. అతను ఇంతకుముందు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సహా కొన్ని సినిమాలు చేశాడు. మధ్యలో కెరీర్ ఆగిపోయింది. ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. ఈలోపే ‘బిగ్ బాస్’లో మూడో స్థానం సాధించిన, ఇంకా తెరంగేట్రం కూడా చేయని సోహెల్ హీరోగా సినిమా అనౌన్స్ కావడం విశేషమే. తనకు ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపును ఏమాత్రం వృథా చేయకుండా సోహెల్ భలేగా ఉపయోగించుకుంటున్నాడే అని అతడి అభిమానులు అనుకుంటున్నారు. సోహెల్ హీరోగా సినిమాకు రెడీ అయిపోతున్నాడు మరి చిరు అందులో క్యామియో చేయడానికి సిద్ధమేనా అన్నది ఇక్కడ ప్రశ్న.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…