బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలె రోజు విజేత అభిజీత్, రన్నరప్ అఖిల్లను మించి హైలైట్ అయ్యాడు మూడో స్థానంలో నిలిచిన సోహెల్. టైటిల్ రేసు నుంచి తప్పుకుని, రూ.25 లక్షలు తీసుకుని మూడో స్థానంతో అతను సంతృప్తి చెందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తన ప్రైజ్ మనీలో రూ.10 లక్షల మొత్తాన్ని అనాథాశ్రమానికి ఇచ్చేస్తానని ప్రకటన చేయడం.. ఆ మొత్తం నాగార్జున ఇవ్వడానికి ముందుక రావడం.. బహుమతి ప్రదానోత్సవానికి వచ్చిన చిరంజీవి సోహెల్కు తిరుగులేని సపోర్ట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఆ సందర్భంగా తాను ఓ సినిమా చేస్తానని.. దానికి చిరంజీవి అండగా నిలవాలని సోహెల్ కోరడం.. చిరు అవసరమైతే తాను ఆ సినిమాలో ఒక క్యామియో కూడా చేస్తాననడం తెలిసిన సంగతే.
ఐతే చిరు అలా హామీ ఇవ్వడంతో సోహెల్ ఏమాత్రం ఆగుతున్నట్లు కనిపించడం లేదు. హౌస్ నుంచి బయటికి వచ్చి నాలుగు రోజులు గడవకముందే అతను హీరోగా కొత్త సినిమా అనౌన్స్ కావడం విశేషం. శ్రీనివాస్ వింజంపాటి అనే కొత్త దర్శకుడు సోహెల్ హీరోగా సినిమా రూపొందించనున్నాడు. జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ సినిమా ఫేమ్ అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఓవైపు బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ సైతం ఇప్పటిదాకా తన కొత్త ప్రాజెక్టుల గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు. అతను ఇంతకుముందు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సహా కొన్ని సినిమాలు చేశాడు. మధ్యలో కెరీర్ ఆగిపోయింది. ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. ఈలోపే ‘బిగ్ బాస్’లో మూడో స్థానం సాధించిన, ఇంకా తెరంగేట్రం కూడా చేయని సోహెల్ హీరోగా సినిమా అనౌన్స్ కావడం విశేషమే. తనకు ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపును ఏమాత్రం వృథా చేయకుండా సోహెల్ భలేగా ఉపయోగించుకుంటున్నాడే అని అతడి అభిమానులు అనుకుంటున్నారు. సోహెల్ హీరోగా సినిమాకు రెడీ అయిపోతున్నాడు మరి చిరు అందులో క్యామియో చేయడానికి సిద్ధమేనా అన్నది ఇక్కడ ప్రశ్న.
This post was last modified on December 24, 2020 3:32 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…