బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలె రోజు విజేత అభిజీత్, రన్నరప్ అఖిల్లను మించి హైలైట్ అయ్యాడు మూడో స్థానంలో నిలిచిన సోహెల్. టైటిల్ రేసు నుంచి తప్పుకుని, రూ.25 లక్షలు తీసుకుని మూడో స్థానంతో అతను సంతృప్తి చెందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తన ప్రైజ్ మనీలో రూ.10 లక్షల మొత్తాన్ని అనాథాశ్రమానికి ఇచ్చేస్తానని ప్రకటన చేయడం.. ఆ మొత్తం నాగార్జున ఇవ్వడానికి ముందుక రావడం.. బహుమతి ప్రదానోత్సవానికి వచ్చిన చిరంజీవి సోహెల్కు తిరుగులేని సపోర్ట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఆ సందర్భంగా తాను ఓ సినిమా చేస్తానని.. దానికి చిరంజీవి అండగా నిలవాలని సోహెల్ కోరడం.. చిరు అవసరమైతే తాను ఆ సినిమాలో ఒక క్యామియో కూడా చేస్తాననడం తెలిసిన సంగతే.
ఐతే చిరు అలా హామీ ఇవ్వడంతో సోహెల్ ఏమాత్రం ఆగుతున్నట్లు కనిపించడం లేదు. హౌస్ నుంచి బయటికి వచ్చి నాలుగు రోజులు గడవకముందే అతను హీరోగా కొత్త సినిమా అనౌన్స్ కావడం విశేషం. శ్రీనివాస్ వింజంపాటి అనే కొత్త దర్శకుడు సోహెల్ హీరోగా సినిమా రూపొందించనున్నాడు. జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ సినిమా ఫేమ్ అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఓవైపు బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ సైతం ఇప్పటిదాకా తన కొత్త ప్రాజెక్టుల గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు. అతను ఇంతకుముందు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సహా కొన్ని సినిమాలు చేశాడు. మధ్యలో కెరీర్ ఆగిపోయింది. ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. ఈలోపే ‘బిగ్ బాస్’లో మూడో స్థానం సాధించిన, ఇంకా తెరంగేట్రం కూడా చేయని సోహెల్ హీరోగా సినిమా అనౌన్స్ కావడం విశేషమే. తనకు ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపును ఏమాత్రం వృథా చేయకుండా సోహెల్ భలేగా ఉపయోగించుకుంటున్నాడే అని అతడి అభిమానులు అనుకుంటున్నారు. సోహెల్ హీరోగా సినిమాకు రెడీ అయిపోతున్నాడు మరి చిరు అందులో క్యామియో చేయడానికి సిద్ధమేనా అన్నది ఇక్కడ ప్రశ్న.
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…