ఈ రోజుల్లో సినిమాలకు మామూలుగానే లాంగ్ రన్ ఉండట్లేదు. మంచి హైప్ తీసుకొచ్చి మెజారిటీ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం, వీకెండ్లో హౌస్ ఫుల్స్ పడితే.. సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకోవడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం. ఇలాంటి టైంలో కరోనా వచ్చి నిర్మాతల్ని దారుణంగా దెబ్బ తీసింది. వ్యాపారాన్ని మరింతగా దిగజార్చింది. ఈ మధ్యే థియేటర్లు తెరుచుకున్నాయి కానీ.. 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో సినిమా ఎంత బాగున్నా సరే.. ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం కష్టమే. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు అలవాటు చేయడమే సవాలుగా మారిపోయింది. ఇలాంటి టైంలో సాయిధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ను రిస్క్ చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.
మిగతా నిర్మాతల్లా నార్మల్సీ కోసం ఎదురు చూడకుండా తమ సినిమాను విడుదల చేస్తున్నందుకు ప్రసాద్ను అందరూ అభినందిస్తున్నారు. ఐతే ఇప్పుడు మరో సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు సైతం ఇదే రిస్క్కు రెడీ అయ్యారు. ఆయన తన క్రాక్ సినిమాను సంక్రాంతికి ఖరారు చేశారు. ఐతే క్రాక్ ముందు నుంచి సంక్రాంతి రిలీజే అంటున్న నేపథ్యంలో ఇందులో కొత్తేముంది అనిపించొచ్చు. కానీ దాంతో పాటు అరణ్య, రంగ్ దె, రెడ్ సినిమాలన సైతం సంక్రాంతికే షెడ్యూల్ చేశారు. కానీ వాటి రిలీజ్ విషయంలో కండిషన్స్ అప్లై అన్నమాట. సంక్రాంతికి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తాయన్న నమ్మకంతో వాళ్లు కర్చీఫ్ వేసి పెట్టారు. కానీ ఇప్పుడా సంకేతాలేమీ కనిపించడం లేదు. దీంతో ఆయా చిత్ర బృందాల నుంచి సౌండ్ లేదు. వాళ్లు విడుదలను వాయిదా వేసుకున్నట్లే.
కానీ క్రాక్ సినిమాను మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా రిలీజ్ చేద్దామనే నిర్మాత ధైర్యం చేస్తున్నాడు. సంక్రాంతికి సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకుల బలహీనత. మామూలుగా ఆ టైంలో మూణ్నాలుగు పెద్ద సినిమాలు రేసులో ఉంటాయి. వాటి స్థానంలో తమ ఒక్క సినిమా ఉంటే.. 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా మంచి వసూళ్లే వస్తాయన్నది క్రాక్ టీం ఆశగా కనిపిస్తోంది.
This post was last modified on December 20, 2020 10:59 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…