ఈ రోజుల్లో సినిమాలకు మామూలుగానే లాంగ్ రన్ ఉండట్లేదు. మంచి హైప్ తీసుకొచ్చి మెజారిటీ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం, వీకెండ్లో హౌస్ ఫుల్స్ పడితే.. సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకోవడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం. ఇలాంటి టైంలో కరోనా వచ్చి నిర్మాతల్ని దారుణంగా దెబ్బ తీసింది. వ్యాపారాన్ని మరింతగా దిగజార్చింది. ఈ మధ్యే థియేటర్లు తెరుచుకున్నాయి కానీ.. 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో సినిమా ఎంత బాగున్నా సరే.. ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం కష్టమే. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు అలవాటు చేయడమే సవాలుగా మారిపోయింది. ఇలాంటి టైంలో సాయిధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ను రిస్క్ చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.
మిగతా నిర్మాతల్లా నార్మల్సీ కోసం ఎదురు చూడకుండా తమ సినిమాను విడుదల చేస్తున్నందుకు ప్రసాద్ను అందరూ అభినందిస్తున్నారు. ఐతే ఇప్పుడు మరో సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు సైతం ఇదే రిస్క్కు రెడీ అయ్యారు. ఆయన తన క్రాక్ సినిమాను సంక్రాంతికి ఖరారు చేశారు. ఐతే క్రాక్ ముందు నుంచి సంక్రాంతి రిలీజే అంటున్న నేపథ్యంలో ఇందులో కొత్తేముంది అనిపించొచ్చు. కానీ దాంతో పాటు అరణ్య, రంగ్ దె, రెడ్ సినిమాలన సైతం సంక్రాంతికే షెడ్యూల్ చేశారు. కానీ వాటి రిలీజ్ విషయంలో కండిషన్స్ అప్లై అన్నమాట. సంక్రాంతికి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తాయన్న నమ్మకంతో వాళ్లు కర్చీఫ్ వేసి పెట్టారు. కానీ ఇప్పుడా సంకేతాలేమీ కనిపించడం లేదు. దీంతో ఆయా చిత్ర బృందాల నుంచి సౌండ్ లేదు. వాళ్లు విడుదలను వాయిదా వేసుకున్నట్లే.
కానీ క్రాక్ సినిమాను మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా రిలీజ్ చేద్దామనే నిర్మాత ధైర్యం చేస్తున్నాడు. సంక్రాంతికి సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకుల బలహీనత. మామూలుగా ఆ టైంలో మూణ్నాలుగు పెద్ద సినిమాలు రేసులో ఉంటాయి. వాటి స్థానంలో తమ ఒక్క సినిమా ఉంటే.. 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా మంచి వసూళ్లే వస్తాయన్నది క్రాక్ టీం ఆశగా కనిపిస్తోంది.
This post was last modified on December 20, 2020 10:59 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…