ఈ రోజుల్లో సినిమాలకు మామూలుగానే లాంగ్ రన్ ఉండట్లేదు. మంచి హైప్ తీసుకొచ్చి మెజారిటీ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం, వీకెండ్లో హౌస్ ఫుల్స్ పడితే.. సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకోవడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం. ఇలాంటి టైంలో కరోనా వచ్చి నిర్మాతల్ని దారుణంగా దెబ్బ తీసింది. వ్యాపారాన్ని మరింతగా దిగజార్చింది. ఈ మధ్యే థియేటర్లు తెరుచుకున్నాయి కానీ.. 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో సినిమా ఎంత బాగున్నా సరే.. ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం కష్టమే. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు అలవాటు చేయడమే సవాలుగా మారిపోయింది. ఇలాంటి టైంలో సాయిధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ను రిస్క్ చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.
మిగతా నిర్మాతల్లా నార్మల్సీ కోసం ఎదురు చూడకుండా తమ సినిమాను విడుదల చేస్తున్నందుకు ప్రసాద్ను అందరూ అభినందిస్తున్నారు. ఐతే ఇప్పుడు మరో సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు సైతం ఇదే రిస్క్కు రెడీ అయ్యారు. ఆయన తన క్రాక్ సినిమాను సంక్రాంతికి ఖరారు చేశారు. ఐతే క్రాక్ ముందు నుంచి సంక్రాంతి రిలీజే అంటున్న నేపథ్యంలో ఇందులో కొత్తేముంది అనిపించొచ్చు. కానీ దాంతో పాటు అరణ్య, రంగ్ దె, రెడ్ సినిమాలన సైతం సంక్రాంతికే షెడ్యూల్ చేశారు. కానీ వాటి రిలీజ్ విషయంలో కండిషన్స్ అప్లై అన్నమాట. సంక్రాంతికి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తాయన్న నమ్మకంతో వాళ్లు కర్చీఫ్ వేసి పెట్టారు. కానీ ఇప్పుడా సంకేతాలేమీ కనిపించడం లేదు. దీంతో ఆయా చిత్ర బృందాల నుంచి సౌండ్ లేదు. వాళ్లు విడుదలను వాయిదా వేసుకున్నట్లే.
కానీ క్రాక్ సినిమాను మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా రిలీజ్ చేద్దామనే నిర్మాత ధైర్యం చేస్తున్నాడు. సంక్రాంతికి సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకుల బలహీనత. మామూలుగా ఆ టైంలో మూణ్నాలుగు పెద్ద సినిమాలు రేసులో ఉంటాయి. వాటి స్థానంలో తమ ఒక్క సినిమా ఉంటే.. 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా మంచి వసూళ్లే వస్తాయన్నది క్రాక్ టీం ఆశగా కనిపిస్తోంది.
This post was last modified on December 20, 2020 10:59 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…