వాసి కన్నా రాశి ముఖ్యం అంటారు. ఒక దర్శకుడి పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి పదుల సంఖ్యలో సినిమాలు తీయనక్కర్లేదు. ఒక్క సినిమా తీసి అది క్లాసిక్ అనిపించుకుంటే ఆ దర్శకుడి పేరు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. అల్ఫాన్సో పుతెరిన్ అనే పేరు దక్షిణాది సినీ ప్రేక్షకులకు అలాగే గుర్తుండిపోయింది.
ప్రేమమ్ అనే ఆధునిక ప్రేమ కావ్యాన్ని అందించిన దర్శకుడు ఇతనే. మలయాళంలో తీసినప్పటికీ.. దక్షిణాదిన అన్ని భాషల వాళ్లనూ ఈ సినిమా మెప్పించింది. భాష తెలియకపోయినా.. సబ్ టైటిల్స్ లేకపోయినా కూడా ఈ సినిమా చూసి మైమరిచిపోయి.. ఆ సినిమా జ్ఞాపకాల్ని మనసుల్లో పదిలంగా దాచుకున్న ప్రేక్షకులు ఎంతమందో. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా మంచి విజయం సాధించింది.
ఐతే ఇలాంటి క్లాసిక్ అందించాక అల్ఫాన్సో ఐదేళ్లకు పైగా సినిమా చేయకపోవడం ఆశ్చర్యకరం. ఇందుకు కారణాలు ఏంటో ఏమో కానీ.. ఎట్టకేలకు అల్ఫాన్సో తన తర్వాతి సినిమాకు సిద్ధమయ్యాడు. అదిరిపోయే కాస్టింగ్తో అల్ఫాన్సో తన తర్వాతి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ తరంలో దక్షిణాదిన గొప్ప నటుల్లో ఒకడిగా పేరు సంపాదించిన ఫాహద్ ఫాజిల్ ఇందులో హీరో కాగా.. సౌత్ హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నయనతార అతడికి జోడీగా నటించనుంది.
వీరి కలయికలో పాట్టు (తెలుగులో పాట అని అర్థం) అనే సినిమా తీయబోతున్నాడు అల్ఫాన్సో. జచారియా థామస్, అల్విన్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్లో పాత కాలం నాటి ఆడియో క్యాసెట్ కనిపిస్తుండటాన్ని బట్టి ఇది పీరియడ్ మూవీ అని అర్థమవుతోంది. ప్రేమమ్ తర్వాత దాని దర్శకుడు రూపొందిస్తున్న సినిమా కావడం, పైగా లీడ్ క్యారెక్టర్లలో టాప్ ఆర్టిస్టులను తీసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయనడంలో సందేహం లేదు.
This post was last modified on December 20, 2020 8:30 am
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…