పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై 2020 సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా ఎఫ్-2. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర అన్నీ భలేగా కలిసొచ్చేశాయి.
ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమాను బాలీవుడ్ స్టయిల్లో ఒక ఫ్రాంఛైజీగా మార్చాలని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నారు. ఎఫ్-2కు కొనసాగింపుగా ఎఫ్-3 పేరుతో ఇప్పటికే సినిమాను అనౌన్స్ చేశారు. ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ నెల మూడో వారంలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. 2021 వేసవికి ఎఫ్-3ని విడుదల చేయాలన్నది ప్లాన్. ఐతే త్వరలో షూటింగ్ మొదలవుతూ ఇంకా దీని కాస్టింగ్ విషయంలో ఒక రూమర్ హల్చల్ చేస్తూనే ఉంది.
ఎఫ్-3లో వెంకీ, వరుణ్లకు తోడుగా ఇంకో హీరో కూడా ఉంటాడని.. అనిల్తో రాజా ది గ్రేట్ చేసిన రవితేజనే ఆ మూడో హీరో అని చాన్నాళ్ల నుంచే ప్రచారం జరుగుతోంది. దీనిపై అనిల్ కానీ, చిత్ర బృందం నుంచి ఇంకెవరు కానీ ఇంత వరకు స్పందించలేదు. దీంతో ఈ ప్రచారం నిజమే అనుకున్నారు జనాలు. ఐతే షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో మొదలవుతుండగా.. మూడో హీరో విషయంలో ఇంకా సస్పెన్స్ ఏంటని అనుకుంటుండగా.. అనిల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ సినిమాలో వెంకీ, వరుణ్ కాకుండా మరో హీరో ఉండడని.. వాళ్ల పాత్రలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశాడు. వారికి జోడీగా తమన్నా, మెహ్రీన్లే నటించనుండగా.. గ్లామర్ అడిషన్ మాత్రం ఉంటుందని, ఇంకో లేడీ క్యారెక్టర్ను తీసుకొస్తున్నారని మాత్రం చెబుతున్నారు. దీనిపై అనిల్ స్పష్టత ఇవ్వలేదు. ఎఫ్-2ను నిర్మించిన దిల్ రాజే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 20, 2020 8:22 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…