పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై 2020 సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా ఎఫ్-2. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర అన్నీ భలేగా కలిసొచ్చేశాయి.
ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమాను బాలీవుడ్ స్టయిల్లో ఒక ఫ్రాంఛైజీగా మార్చాలని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నారు. ఎఫ్-2కు కొనసాగింపుగా ఎఫ్-3 పేరుతో ఇప్పటికే సినిమాను అనౌన్స్ చేశారు. ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ నెల మూడో వారంలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. 2021 వేసవికి ఎఫ్-3ని విడుదల చేయాలన్నది ప్లాన్. ఐతే త్వరలో షూటింగ్ మొదలవుతూ ఇంకా దీని కాస్టింగ్ విషయంలో ఒక రూమర్ హల్చల్ చేస్తూనే ఉంది.
ఎఫ్-3లో వెంకీ, వరుణ్లకు తోడుగా ఇంకో హీరో కూడా ఉంటాడని.. అనిల్తో రాజా ది గ్రేట్ చేసిన రవితేజనే ఆ మూడో హీరో అని చాన్నాళ్ల నుంచే ప్రచారం జరుగుతోంది. దీనిపై అనిల్ కానీ, చిత్ర బృందం నుంచి ఇంకెవరు కానీ ఇంత వరకు స్పందించలేదు. దీంతో ఈ ప్రచారం నిజమే అనుకున్నారు జనాలు. ఐతే షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో మొదలవుతుండగా.. మూడో హీరో విషయంలో ఇంకా సస్పెన్స్ ఏంటని అనుకుంటుండగా.. అనిల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ సినిమాలో వెంకీ, వరుణ్ కాకుండా మరో హీరో ఉండడని.. వాళ్ల పాత్రలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశాడు. వారికి జోడీగా తమన్నా, మెహ్రీన్లే నటించనుండగా.. గ్లామర్ అడిషన్ మాత్రం ఉంటుందని, ఇంకో లేడీ క్యారెక్టర్ను తీసుకొస్తున్నారని మాత్రం చెబుతున్నారు. దీనిపై అనిల్ స్పష్టత ఇవ్వలేదు. ఎఫ్-2ను నిర్మించిన దిల్ రాజే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 20, 2020 8:22 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…