సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మంచి పాత్ర ఇస్తే దానికి జీవం పోసేయడంలో ఆమె దిట్ట. అందుకు నెట్ఫ్లిక్స్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన పావ కధైగళ్ చక్కని ఉదాహరణ. నాలుగు కథల సమాహారమయిన ఈ చిత్రంలో సాయి పల్లవి నటించిన సెగ్మెంట్కి ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ప్రకాష్రాజ్ కూతురిగా సాయి పల్లవి ఇందులో కనిపిస్తుంది. తండ్రికి ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిన కూతురిగా సాయి పల్లవి నటించింది.
రెండేళ్ల తర్వాత ఆమె ఆచూకీ తెలుసుకుని వచ్చిన తండ్రి కూతురు గర్భవతి కావడంతో సీమంతం చేస్తానంటూ ఇంటికి తీసుకెళతాడు. కుటుంబ పరువు తీసిందనే కోపంతో ఆమె గర్భవతి అని కూడా చూడకుండా విషం ఇచ్చేస్తాడు. కంటి ముందే కూతురు చనిపోతున్నా కానీ చలించకుండా చూస్తాడే తప్ప బ్రతికించాలని చూడడు. ఈ సెగ్మెంట్లో సాయి పల్లవి నటన గురించి ఇప్పుడు సోషల్ మీడియా అంతా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. విమర్శకులు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చాలా కాలం తర్వాత ప్రకాష్రాజ్ మళ్లీ ఒక స్ట్రయికింగ్ క్యారెక్టర్ చేసాడు. నాలుగు కథలలో ఇదే అత్యంత హృదయ విదారకంగా వుందంటూ విమర్శకులు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే మరో సెగ్మెంట్లో సిమ్రన్ నటన కూడా అందరి ప్రశంసలను చూరగొంటోంది.
This post was last modified on December 20, 2020 12:30 am
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…