సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మంచి పాత్ర ఇస్తే దానికి జీవం పోసేయడంలో ఆమె దిట్ట. అందుకు నెట్ఫ్లిక్స్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన పావ కధైగళ్ చక్కని ఉదాహరణ. నాలుగు కథల సమాహారమయిన ఈ చిత్రంలో సాయి పల్లవి నటించిన సెగ్మెంట్కి ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ప్రకాష్రాజ్ కూతురిగా సాయి పల్లవి ఇందులో కనిపిస్తుంది. తండ్రికి ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిన కూతురిగా సాయి పల్లవి నటించింది.
రెండేళ్ల తర్వాత ఆమె ఆచూకీ తెలుసుకుని వచ్చిన తండ్రి కూతురు గర్భవతి కావడంతో సీమంతం చేస్తానంటూ ఇంటికి తీసుకెళతాడు. కుటుంబ పరువు తీసిందనే కోపంతో ఆమె గర్భవతి అని కూడా చూడకుండా విషం ఇచ్చేస్తాడు. కంటి ముందే కూతురు చనిపోతున్నా కానీ చలించకుండా చూస్తాడే తప్ప బ్రతికించాలని చూడడు. ఈ సెగ్మెంట్లో సాయి పల్లవి నటన గురించి ఇప్పుడు సోషల్ మీడియా అంతా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. విమర్శకులు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చాలా కాలం తర్వాత ప్రకాష్రాజ్ మళ్లీ ఒక స్ట్రయికింగ్ క్యారెక్టర్ చేసాడు. నాలుగు కథలలో ఇదే అత్యంత హృదయ విదారకంగా వుందంటూ విమర్శకులు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే మరో సెగ్మెంట్లో సిమ్రన్ నటన కూడా అందరి ప్రశంసలను చూరగొంటోంది.
సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న…
రాజకీయ నేతలు...ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్…
డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు,…
ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో.. వైరల్ అయిపోతారో చెప్పలేం. కొన్నేళ్ళ ముందు అక్కినేని కుర్రాడు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు.. నగరాలు, పట్టణాల్లో ఎంత ఇమేజ్ ఉందో.. గిరిజన ప్రాంతాల్లోనూ అంతే ఇమేజ్ ఉంది. సినిమా…