Movie News

కంగ‌నా చేసిన అన్యాయంపై క్రిష్ స‌వివ‌రంగా..

మ‌న ద‌ర్శ‌కుడు క్రిష్ బాలీవుడ్లో మ‌ణిక‌ర్ణిక లాంటి భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడ‌ని అంద‌రూ సంతోషించారు. కానీ అత‌నా సినిమాను పూర్తి చేశాక క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్ రంగంలోకి దిగి, క్రిష్‌ను ప‌క్క‌న పెట్టి సొంతంగా అనేక స‌న్నివేశాలు రీషూట్లు చేయ‌డం ఎంత వివాదానికి దారి తీసిందో తెలిసిందే.

దీనిపై ఇప్ప‌టికే ఒక‌సారి ఓ బాలీవుడ్ మీడియా సంస్థ‌తో త‌న ఆవేద‌న పంచుకున్నాడు క్రిష్‌. ఇప్పుడు ఆహా ఓటీటీలో స‌మంత నిర్వ‌హించే టాక్ షోకు అతిథిగా వ‌చ్చిన క్రిష్ ఆ వివాదంపై వివ‌రంగా మాట్లాడాడు. అస‌లు ఆ సినిమా విష‌యంలో ఎప్పుడేం జ‌రిగిందో, కంగ‌నా త‌న ప‌ట్ల ఎంత అన్యాయంగా ప్ర‌వ‌ర్తించిందో కూలంక‌షంగా క్రిష్ వివ‌రించాడు.

‘‘91 రోజుల పాటు మేమంతా ఎంతో సంతోషంగా ‘మణికర్ణిక’ షూటింగ్‌ పూర్తి చేశాం. షూట్ జ‌రుగుతుండ‌గా కంగనకు, నాకూ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. అంతా ఎంతో సంతోషంగా సాగిపోయింది. రీరికార్డింగ్ జ‌రుగుతున్న‌పుడు కంగన టీమ్ వ‌చ్చి సినిమా చూశారు. ఫస్ట్‌ హాఫ్‌ వాళ్లకి బాగా నచ్చింది. సెకండ్ హాఫ్‌ కూడా బాగుందని చెప్పారు.
కానీ కొన్ని రోజుల త‌ర్వాత వాళ్ల నుంచి నాకు ఫోన్ వ‌చ్చింది. కొన్ని స‌న్నివేశాలు బాలేవ‌ని, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ స‌రిగా లేద‌ని చెప్పారు. అలాగే సోనూ సూద్ చేసిన స‌దాశివ్ పాత్ర విష‌యంలో అభ్యంత‌రం తెలిపారు. ద్వితీయార్ధంలో ఆ పాత్ర చివరి 20 నిమిషాల వరకూ ఉంటుంది. అది వాళ్లకు నచ్చలేదు. ఆ పాత్ర‌ను ప్ర‌థ‌మార్ధంలోనే ముగించ‌మ‌న్నారు. అది నా వల్ల కాదని, ‘మణికర్ణిక’ లాంటి చ‌రిత్రతో ముడిప‌డ్డ సినిమాలో అలా చేయ‌లేమ‌ని చెప్పాను. త‌న పాత్ర‌ను ఇలా త‌గ్గించ‌డానికి సోనూ కూడా ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని సోనూ కంగనాకు ఫోన్‌ చేసి చెప్పాడు.
అందుకామె.. ‘క్రిష్‌ రీషూట్‌ చేయకపోతే నేను చిత్రీకరిస్తాను’ అని సమాధానమివ్వడంతో వివాదం మొద‌లైంది. ఆ తర్వాత వాళ్లే రీషూట్‌ చేసుకున్నారు. నా బాధ ఏమిటంటే.. నేను అనుకున్న, తెరకెక్కించిన కథను ప్రజలకు చూపించలేకపోయాను’’ అని క్రిష్‌ తెలిపాడు. ఐతే ఈ వివాదంపై తాను మాట్లాడ‌టం ఇదే చివ‌రిసార‌ని, ఇక‌పై ఎప్పుడూ దాని గురించి మాట్లాడ‌ద‌లుచుకోలేద‌ని క్రిష్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 19, 2020 8:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు మార్కు చొరవ ఎవ్వరికీ సాధ్యం కాదంతే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…

45 minutes ago

డాల్బీ థియేటర్లు వస్తున్నాయ్….హైదరాబాద్ కూడా

మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…

2 hours ago

మిరాయ్ మెరుపుల్లో దగ్గుబాటి రానా

హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago

పాస్టర్ ప్రవీణ్.. ఇంకో కీలక వీడియో బయటికి

క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…

3 hours ago

కన్నప్ప ప్రీమియర్ వెనుక కహానీ ఏంటంటే

నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…

4 hours ago

ఏపీపై అమిత్ షా ఫోకస్ పెరిగినట్టే

వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…

4 hours ago