సినిమాల రిలీజ్ లేదు. షూటింగులు ఆగిపోయాయి. సినిమాను నమ్ముకున్న వారి కష్టాలు మామూలుగా లేవు. థియేటర్లయితే ఇప్పుడిప్పుడే తెరుచుకోవని అర్థమవుతోంది. ఇంకో ఐదారు నెలల దాకా ఎదురు చూడాల్సి రావచ్చు.
కనీసం షూటింగులకైనా అనుమతిస్తే పరిశ్రమను నమ్ముకున్న కార్మికుల కష్టాలు తీరుతాయి. అలాగే నిర్మాతల మీద భారం తగ్గుతుంది. లాక్ డౌన్ టైంలో అయితే అందుకు అవకాశం లేదు. కనీసం మూడో లాక్ డౌన్ ముగిసే సమయానికైనా చిత్రీకరణలకు అనుమతులిస్తే చాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ఆల్రెడీ దిల్ రాజు నేతృత్వంలో నిర్మాతల బృందం తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీవీ నిర్మాతల సంఘం నేరుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ను కలిసి అనుమతుల కోసం విన్నవించి వచ్చింది. తక్కువ మంది సిబ్బందితో, భౌతిక దూరం పాటిస్తూ షూటింగులు చేస్తామని వాళ్లు విన్నవించారు.
షూటింగులకు అనుమతులు ఇచ్చే విషయంలో ఇంకో రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 5న మంత్రి మండలితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చే విషయమై ఇందులో చర్చ జరగనుంది. సినీ రంగానికి సంబంధించి కూడా అందులో చర్చ జరగనుంది.
ఐతే ఆ సమావేశం కంటే ముందు మంత్రి తలసాని సినీ ప్రముఖులు, మీడియా వాళ్లతో సమావేశం నిర్వహించనున్నారు. షూటింగులు, ఇతర విషయాలపై ఇందులో చర్చించి.. క్రోఢీకరించిన అభిప్రాయాల్నిమంత్రి మండలి ముందు పెట్టనున్నారు. ఈ నెల 17 తర్వాత కొన్ని షరతుల మధ్య షూటింగులు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వొచ్చని.. ఈ మేరకు సమావేశంలో నిర్ణయం వెలువడ వచ్చని సినిమా వాళ్లు ఆశిస్తున్నారు.
This post was last modified on May 4, 2020 3:44 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…