క్రిష్-4.. దశాబ్దం కిందట్నుంచి చర్చల్లో ఉన్న సినిమా. హృతిక్ రోషన్ హీరోగా అతడి తండ్రి తీసిన కోయీ మిల్గయా పెద్ద హిట్ కాగా.. దానికి కొనసాగింపుగా ఇదే కాంబినేషన్లో రూపొందిన క్రిష్, క్రిష్-3 ఇంకా పెద్ద విజయాలు సాధించాయి. దీంతో ఈ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా అయిన క్రిష్-4ను ఇంకా భారీగా తీయాలనుకున్నాడు రాకేష్ రోషన్.
కానీ ఒకవైపు బడ్జెట్ ఇబ్బందులు, రాకేష్ రోషన్ ఆరోగ్య సమస్యలు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కూడా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా ప్రయత్నించాడు రాకేష్. కానీ ఆయన వల్ల కాలేదు.
ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి రాకేశ్ తప్పుకోగా.. చివరికి హృతిక్ రోషనే మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయ్యాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ అయింది. వార్-2 తర్వాత ఏ సినిమా చేయకుండా కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టు కోసమే సమయం వెచ్చిస్తున్నాడు హృతిక్.
ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ బ్రేక్ పడినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. బడ్జెట్ సమస్యల వల్లే క్రిష్-2 ముందుకు కదలట్లేదట. హృతిక్ అండ్ టీం వేసుకున్న ప్రణాళికల ప్రకారం ఈ సినిమాకు రూ.500 కోట్లు ఖర్చవుతుందట. అంత పెట్టి సినిమా తీసి వర్కవుట్ చేయడం కష్టమన్నది యశ్ రాజ్ ఫిలిమ్స్ భావనట.
బడ్జెట్ను రూ.350 కోట్లకు తగ్గిస్తే సినిమాను ప్రొడ్యూస్ చేస్తామని నిర్మాత ఆదిత్య చోప్రా స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆ మేరకు స్క్రిప్టు మార్చే పనిలో ఉందట హృతిక్ టీం. ఐతే స్క్రిప్టు మారిస్తే సినిమా స్కేల్ తగ్గిపోతుందని.. అనుకున్నంత గొప్పగా ఉండదని హృతిక్ బృందం ఆలోచిస్తోందట.
ఈ నేపథ్యంలో వేరే ఏదైనా ప్రొడక్షన్ హౌస్ రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తుందేమో అని ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నట్లు సమాచారం. అలా కాని పక్షంలో స్క్రిప్టు మార్చుకుని సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి ఇంకా సమయం పట్టొచ్చు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…