క్రిష్-4.. దశాబ్దం కిందట్నుంచి చర్చల్లో ఉన్న సినిమా. హృతిక్ రోషన్ హీరోగా అతడి తండ్రి తీసిన కోయీ మిల్గయా పెద్ద హిట్ కాగా.. దానికి కొనసాగింపుగా ఇదే కాంబినేషన్లో రూపొందిన క్రిష్, క్రిష్-3 ఇంకా పెద్ద విజయాలు సాధించాయి. దీంతో ఈ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా అయిన క్రిష్-4ను ఇంకా భారీగా తీయాలనుకున్నాడు రాకేష్ రోషన్.
కానీ ఒకవైపు బడ్జెట్ ఇబ్బందులు, రాకేష్ రోషన్ ఆరోగ్య సమస్యలు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కూడా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా ప్రయత్నించాడు రాకేష్. కానీ ఆయన వల్ల కాలేదు.
ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి రాకేశ్ తప్పుకోగా.. చివరికి హృతిక్ రోషనే మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయ్యాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ అయింది. వార్-2 తర్వాత ఏ సినిమా చేయకుండా కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టు కోసమే సమయం వెచ్చిస్తున్నాడు హృతిక్.
ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ బ్రేక్ పడినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. బడ్జెట్ సమస్యల వల్లే క్రిష్-2 ముందుకు కదలట్లేదట. హృతిక్ అండ్ టీం వేసుకున్న ప్రణాళికల ప్రకారం ఈ సినిమాకు రూ.500 కోట్లు ఖర్చవుతుందట. అంత పెట్టి సినిమా తీసి వర్కవుట్ చేయడం కష్టమన్నది యశ్ రాజ్ ఫిలిమ్స్ భావనట.
బడ్జెట్ను రూ.350 కోట్లకు తగ్గిస్తే సినిమాను ప్రొడ్యూస్ చేస్తామని నిర్మాత ఆదిత్య చోప్రా స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆ మేరకు స్క్రిప్టు మార్చే పనిలో ఉందట హృతిక్ టీం. ఐతే స్క్రిప్టు మారిస్తే సినిమా స్కేల్ తగ్గిపోతుందని.. అనుకున్నంత గొప్పగా ఉండదని హృతిక్ బృందం ఆలోచిస్తోందట.
ఈ నేపథ్యంలో వేరే ఏదైనా ప్రొడక్షన్ హౌస్ రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తుందేమో అని ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నట్లు సమాచారం. అలా కాని పక్షంలో స్క్రిప్టు మార్చుకుని సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి ఇంకా సమయం పట్టొచ్చు.
This post was last modified on February 7, 2026 10:17 pm
ఏపీలో పంచాయతీ ఎన్నికల ఘట్టం ప్రారంభం అయింది. ఎన్నికలకు సంబంధించిన ముందస్తు కార్యాచరణకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి…
సోషల్ మీడియాల్లో రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే రీల్స్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసభ్య…
అనుకున్నదే జరుగుతోంది. థియేటర్లలో రిలీజైనప్పటి కంటే ఓటీటీలోకి వచ్చాక ‘ది రాజాసాబ్’ మీద ట్రోలింగ్ ఇంకా ఎక్కువ జరుగుతోంది. సినిమా…
ఈ మధ్య కంటెంట్ కన్నా ఎక్కువగా కాంట్రావర్సితో వార్తల్లో నిలిచిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్…
ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయిన మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్.. 2021లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాక స్పీడు తగ్గించాడు.…
పదహారు సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు డిజాస్టర్. నిర్మాత నాగబాబుని నిండా ముంచేసిన సినిమా. ఇప్పుడు చూస్తేనేమో కల్ట్ క్లాసిక్. మూడోసారి…