గణేష్ ఆచార్య.. భారతీయ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఇండియన్ సినిమా చరత్రలోనే బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లలో ఒకడు. మూడు దశాబ్దాలకు పైగా అలుపు సొలుపూ లేకుండా వందల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్.
ప్రభుదేవా, లారెన్స్ సహా చాలామంది డ్యాన్స్ మాస్టర్లు వేరే విభాగాల వైపు వెళ్లిపోయారు కానీ.. గణేష్ మాత్రం నృత్యాన్నే నమ్ముకున్నాడు. బాలీవుడ్లో అందరు బడా స్టార్లతో స్టెప్పులేయించిన ఘనత గణేష్ సొంతం. తెలుగులో ఈ తరం బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడైన అల్లు అర్జున్తో ఇద్దరమ్మాయిలతో, దువ్వాడ జగన్నాథం సినిమాలకు పని చేశాడు గణేష్. ఐతే కొన్నేళ్ల కిందట గణేష్ను చూసిన వాళ్లు.. ఇప్పుడు అతణ్ని చూసి గుర్తు పట్టడం కష్టమే.
విపరీతంగా బరువు పెరిగిపోయి ఒక దశలో 200 కిలోలకు చేరుకున్న గణేష్.. ఇప్పుడు వంద కిలోల బరువు తగ్గించుకుని చాలా ఏళ్ల కిందటి లుక్లోకి మారిపోయాడు. తాజాగా ‘కపిల్ శర్మ షో’కు సంబంధించిన ప్రోమోలో కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఐతే బేరియాట్రిక్ సర్జరీ లాంటిదేమీ చేసుకోకుండానే కేవలం వర్కవుట్లు, డైట్ ద్వారానే గణేష్ ఇంత బరువు తగ్గాడట.200 కిలోల బరువున్న తాను కొన్ని నెలల పాటు అత్యంత కఠినమైన వర్కౌట్లు చేసినట్లు ఈ సందర్భంగా గణేశ్ ఆచార్య చెప్పాడు. వ్యాయామం విషయంలో గణేష్ ఎంత కఠినంగా ఉండేవాడనేది ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే తెలుస్తుంది. బరువు విషయంలో గణేశ్ ఆచార్య కొన్నేళ్లుగా కృషి చేస్తున్నాడు.
This post was last modified on December 18, 2020 7:41 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…