లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొంతమంది తక్కువ మంది జనాలతో నామమాత్రంగా వివాహాలు జరిపించేశారు. టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ కూడా ఒక దశలో తక్కువ మంది జనాలతో పెళ్లి కానిచ్చేయాలని అనుకున్నాడు.
కరోనా ప్రభావం ఓ మోస్తరుగా ఉన్న సమయంలో.. ఏం జరిగినా తన పెళ్లి ఆగదంటూ అతను ప్రకటన చేశాడు కూడా. కానీ తర్వాత కరోనా తీవ్రతను అర్థం చేసుకున్న అతను.. పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఐతే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశాక.. పరిస్థితులు సాధారణంగా మారాక నిఖిల్ పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుండేది. కానీ మళ్లీ తొందరపడ్డాడు. రెండో లాక్ డౌన్ గడువు ముగిశాక పొడిగింపు ఉండదని.. ఆంక్షలన్నీ ఎత్తేస్తారని అనుకున్నాడు. ఈ ఆలోచనతోనే మే 14న పెళ్లికి కొత్త ముహూర్తం పెట్టుకున్నాడు.
చివరికి చూస్తే దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో నిఖిల్ మరోసారి తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది తనకు చాలా ఇబ్బందికర అనుభవం అన్నాడు నిఖిల్. ఐతే జనం పడుతున్న కష్టాల ముందు తన కష్టం చాలా చిన్నదన్నాడు. ఈసారి పరిస్థితులు పూర్తిగా సాధారణంగా మారాకే పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని అతను చెప్పాడు.
భీమవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ వివాహం ఖాయమైన సంగతి తెలిసిందే. నిఖిల్ గత ఏడాదే పల్లవిని కలిశాడు. ఆమెతో మాట్లాడాక తనకు సరైన జీవిత భాగస్వామి అనిపించి పెళ్లి ప్రపోజల్ పెట్టడం.. ఆమె ఓకే అనడం.. తర్వాత ఇరు కుటుంబాల నుంచి అంగీకారం రావడంతో వీరి పెళ్లికి రంగం సిద్ధమైంది. కానీ ఇంతలో కరోనా వచ్చి నిఖిల్, పల్లవి ఒక్కటి కాకుండా ఆపింది.
This post was last modified on May 3, 2020 10:46 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…