Movie News

రెండోసారి పెళ్లి వాయిదా వేసుకున్న హీరో

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొంతమంది తక్కువ మంది జనాలతో నామమాత్రంగా వివాహాలు జరిపించేశారు. టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ కూడా ఒక దశలో తక్కువ మంది జనాలతో పెళ్లి కానిచ్చేయాలని అనుకున్నాడు.

కరోనా ప్రభావం ఓ మోస్తరుగా ఉన్న సమయంలో.. ఏం జరిగినా తన పెళ్లి ఆగదంటూ అతను ప్రకటన చేశాడు కూడా. కానీ తర్వాత కరోనా తీవ్రతను అర్థం చేసుకున్న అతను.. పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఐతే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశాక.. పరిస్థితులు సాధారణంగా మారాక నిఖిల్ పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుండేది. కానీ మళ్లీ తొందరపడ్డాడు. రెండో లాక్ డౌన్ గడువు ముగిశాక పొడిగింపు ఉండదని.. ఆంక్షలన్నీ ఎత్తేస్తారని అనుకున్నాడు. ఈ ఆలోచనతోనే మే 14న పెళ్లికి కొత్త ముహూర్తం పెట్టుకున్నాడు.

చివరికి చూస్తే దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో నిఖిల్ మరోసారి తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది తనకు చాలా ఇబ్బందికర అనుభవం అన్నాడు నిఖిల్. ఐతే జనం పడుతున్న కష్టాల ముందు తన కష్టం చాలా చిన్నదన్నాడు. ఈసారి పరిస్థితులు పూర్తిగా సాధారణంగా మారాకే పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని అతను చెప్పాడు.

భీమవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ వివాహం ఖాయమైన సంగతి తెలిసిందే. నిఖిల్ గత ఏడాదే పల్లవిని కలిశాడు. ఆమెతో మాట్లాడాక తనకు సరైన జీవిత భాగస్వామి అనిపించి పెళ్లి ప్రపోజల్ పెట్టడం.. ఆమె ఓకే అనడం.. తర్వాత ఇరు కుటుంబాల నుంచి అంగీకారం రావడంతో వీరి పెళ్లికి రంగం సిద్ధమైంది. కానీ ఇంతలో కరోనా వచ్చి నిఖిల్, పల్లవి ఒక్కటి కాకుండా ఆపింది.

This post was last modified on May 3, 2020 10:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

14 hours ago