Movie News

రెండోసారి పెళ్లి వాయిదా వేసుకున్న హీరో

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొంతమంది తక్కువ మంది జనాలతో నామమాత్రంగా వివాహాలు జరిపించేశారు. టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ కూడా ఒక దశలో తక్కువ మంది జనాలతో పెళ్లి కానిచ్చేయాలని అనుకున్నాడు.

కరోనా ప్రభావం ఓ మోస్తరుగా ఉన్న సమయంలో.. ఏం జరిగినా తన పెళ్లి ఆగదంటూ అతను ప్రకటన చేశాడు కూడా. కానీ తర్వాత కరోనా తీవ్రతను అర్థం చేసుకున్న అతను.. పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఐతే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశాక.. పరిస్థితులు సాధారణంగా మారాక నిఖిల్ పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుండేది. కానీ మళ్లీ తొందరపడ్డాడు. రెండో లాక్ డౌన్ గడువు ముగిశాక పొడిగింపు ఉండదని.. ఆంక్షలన్నీ ఎత్తేస్తారని అనుకున్నాడు. ఈ ఆలోచనతోనే మే 14న పెళ్లికి కొత్త ముహూర్తం పెట్టుకున్నాడు.

చివరికి చూస్తే దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో నిఖిల్ మరోసారి తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది తనకు చాలా ఇబ్బందికర అనుభవం అన్నాడు నిఖిల్. ఐతే జనం పడుతున్న కష్టాల ముందు తన కష్టం చాలా చిన్నదన్నాడు. ఈసారి పరిస్థితులు పూర్తిగా సాధారణంగా మారాకే పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని అతను చెప్పాడు.

భీమవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ వివాహం ఖాయమైన సంగతి తెలిసిందే. నిఖిల్ గత ఏడాదే పల్లవిని కలిశాడు. ఆమెతో మాట్లాడాక తనకు సరైన జీవిత భాగస్వామి అనిపించి పెళ్లి ప్రపోజల్ పెట్టడం.. ఆమె ఓకే అనడం.. తర్వాత ఇరు కుటుంబాల నుంచి అంగీకారం రావడంతో వీరి పెళ్లికి రంగం సిద్ధమైంది. కానీ ఇంతలో కరోనా వచ్చి నిఖిల్, పల్లవి ఒక్కటి కాకుండా ఆపింది.

This post was last modified on May 3, 2020 10:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

2 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

4 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

6 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

7 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

8 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

8 hours ago