2019 దర్శకుడు క్రిష్కు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆయన దర్శకత్వంలో తెలుగులో వచ్చిన యన్టీఆర్ రెండు భాగాలూ తీవ్రంగా నిరాశ పరిచాయి. మరోవైపు హిందీలో క్రిష్ డైరెక్ట్ చేసిన మణికర్ణిక బాగానే ఆడినా.. దాని క్రెడిట్ ఆయనకు దక్కలేదు.
క్రిష్ ఈ సినిమాను పూర్తి చేశాక.. కథానాయిక కంగనా రనౌత్ రంగంలోకి దిగి మళ్లీ రీషూట్లు చేయడం, దర్శకురాలిగా తన పేరును కూడా జోడించడం క్రిష్కు అవమానంగా మారింది. దీనిపై విడుదల సమయంలో పెద్ద వివాదమే నడిచింది. క్రిష్ తన వాదనను బలంగానే వినిపించాడు. కానీ ఆయనపై కంగనా టీం గట్టిగానే ఎదురు దాడి చేసింది. అప్పటికి ఆ వివాదం సద్దుమణిగిపోగా.. క్రిష్ టాలీవుడ్కు తిరిగొచ్చేసి ఇక్కడ సినిమాలు చేసుకుంటున్నాడు.
కాగా ఆహా ఓటీటీలో తాజాగా సమంత నిర్వహిస్తున్న సామ్ జామ్ కార్యక్రమానికి రకుల్ప్రీత్తో కలిసి అతిథిగా వచ్చిన క్రిష్.. మణికర్ణిక వివాదం గురించి మాట్లాడాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. మణికర్ణిక గురించి తాను ఒక్కసారి మాత్రమే బహిరంగంగా మాట్లాడానని.. ఇప్పుడు చివరిసారిగా ఒకసారి మాట్లాడుతానని క్రిష్ అన్నాడు. సినిమా పూర్తి చేసిన రెండు రోజులకు కంగనా రనౌత్, తన టీం వచ్చి రష్ చూసిందని క్రిష్ వ్యాఖ్యానించడం ప్రోమోలో కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫుల్ ఎపిసోడ్లో చూపించనున్నారు. కాగా ఒక స్టోరీ టెల్లర్గా తాను ప్రపంచానికి తెలియకుండా పోతానేమో అన్న భయం ఆ సమయంలో తనకు కలిగినట్లు క్రిష్ ఆవేదనభరితంగా చెప్పాడు ఈ షోలో. మిగతా కథంతా ఫుల్ ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుంది. కొన్ని రోజుల్లోనే అది రాబోతోంది. ప్రోమోను బట్టి చూస్తే మాత్రం క్రిష్ తన అభిప్రాయాల్ని బలంగానే చెప్పినట్లుంది. కొన్ని సంచలన విషయాలు బయటికొచ్చేలాగే ఉన్నాయి.
This post was last modified on December 17, 2020 7:12 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…