Movie News

క్రిష్.. మ‌ణిక‌ర్ణిక‌పై చివ‌రిసారిగా

2019 ద‌ర్శ‌కుడు క్రిష్‌కు ఓ చేదు జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో వ‌చ్చిన య‌న్టీఆర్ రెండు భాగాలూ తీవ్రంగా నిరాశ ప‌రిచాయి. మ‌రోవైపు హిందీలో క్రిష్ డైరెక్ట్ చేసిన మ‌ణిక‌ర్ణిక బాగానే ఆడినా.. దాని క్రెడిట్ ఆయ‌న‌కు ద‌క్క‌లేదు.

క్రిష్ ఈ సినిమాను పూర్తి చేశాక.. క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్ రంగంలోకి దిగి మ‌ళ్లీ రీషూట్లు చేయ‌డం, ద‌ర్శ‌కురాలిగా త‌న పేరును కూడా జోడించ‌డం క్రిష్‌కు అవ‌మానంగా మారింది. దీనిపై విడుద‌ల స‌మ‌యంలో పెద్ద వివాద‌మే న‌డిచింది. క్రిష్ త‌న వాద‌న‌ను బ‌లంగానే వినిపించాడు. కానీ ఆయ‌న‌పై కంగ‌నా టీం గ‌ట్టిగానే ఎదురు దాడి చేసింది. అప్ప‌టికి ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిపోగా.. క్రిష్ టాలీవుడ్‌కు తిరిగొచ్చేసి ఇక్క‌డ సినిమాలు చేసుకుంటున్నాడు.

కాగా ఆహా ఓటీటీలో తాజాగా స‌మంత నిర్వ‌హిస్తున్న సామ్ జామ్ కార్య‌క్ర‌మానికి ర‌కుల్‌ప్రీత్‌తో క‌లిసి అతిథిగా వ‌చ్చిన క్రిష్‌.. మ‌ణిక‌ర్ణిక వివాదం గురించి మాట్లాడాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. మ‌ణిక‌ర్ణిక గురించి తాను ఒక్క‌సారి మాత్ర‌మే బ‌హిరంగంగా మాట్లాడాన‌ని.. ఇప్పుడు చివ‌రిసారిగా ఒక‌సారి మాట్లాడుతాన‌ని క్రిష్ అన్నాడు. సినిమా పూర్తి చేసిన రెండు రోజుల‌కు కంగ‌నా ర‌నౌత్, త‌న టీం వ‌చ్చి ర‌ష్ చూసిందని క్రిష్ వ్యాఖ్యానించ‌డం ప్రోమోలో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఫుల్ ఎపిసోడ్లో చూపించ‌నున్నారు. కాగా ఒక స్టోరీ టెల్ల‌ర్‌గా తాను ప్ర‌పంచానికి తెలియ‌కుండా పోతానేమో అన్న భ‌యం ఆ స‌మ‌యంలో త‌న‌కు క‌లిగిన‌ట్లు క్రిష్ ఆవేద‌న‌భ‌రితంగా చెప్పాడు ఈ షోలో. మిగ‌తా క‌థంతా ఫుల్ ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుంది. కొన్ని రోజుల్లోనే అది రాబోతోంది. ప్రోమోను బ‌ట్టి చూస్తే మాత్రం క్రిష్ త‌న అభిప్రాయాల్ని బ‌లంగానే చెప్పిన‌ట్లుంది. కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టికొచ్చేలాగే ఉన్నాయి.

This post was last modified on December 17, 2020 7:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

2 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

2 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

3 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

3 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

6 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

7 hours ago