Movie News

సాయిధరమ్ తేజ్.. 50 ఏళ్లు వెనక్కి


ప్రతి హీరో కెరీర్లో ఒక్కసారి అయినా కాలంలో వెనక్కి ప్రయాణించాలనుకుంటాడు. కొన్ని దశాబ్దాల వెనుకటి కథలతో సినిమాలు చేయాలనుకుంటాడు. వింటేజ్ టచ్ ఉన్న కథల్లో నటించడం ఎవరినైనా ఎగ్జైట్ చేస్తుంది. మెగా హీరోల్లో ఆల్రెడీ చాలామంది ఆ టైపు కథలు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అలాంటి కథతోనే ‘పుష్ప’ చేస్తున్నాడు.

త్వరలోనే సాయిధరమ్ తేజ్ సైతం ఈ లీగ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. అతను 50 ఏళ్ల వెనుకటి నేపథ్యంతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి దర్శకుడు కార్తీక్ దండు. ఇతను అగ్ర దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు. సుక్కు రాసిన కథతోనే సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు తేజు.

ఇది 70వ దశకం నేపథ్యంలో నడిచే మిస్టరీ థ్రిల్లర్ కథ అని చెప్పాడు. తన కెరీర్లో ఇంతకుముందెన్నడూ ఇలాంటి కథలో నటించలేదని.. ఇది తనకో వైవిధ్యమైన సినిమా అవుతుందని తేజు తెలిపాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న తేజు సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ను నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాదే.. సుకుమార్‌తో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. సుకుమార్ కథ.. పైగా 70వ దశకంలో సాగేది అంటే.. ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భావిస్తున్నారు.

ఇది కాక తేజు.. దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న ఆ చిత్రం షూటింగ్ 60 శాతం పూర్తయినట్లు తేజు వెల్లడించాడు. అది పొలిటికల్ డ్రామా అన్న సంగతి తెలిసిందే. ఇందులో తేజు నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడట. ‘ప్రస్థానం’తో అందరినీ ఆశ్చర్యపరిచిన దేవా.. ఆ తర్వాత అంచనాలు అందుకోలేకపోయాడు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు.

Satya

Recent Posts

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

13 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

1 hour ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

1 hour ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

1 hour ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

2 hours ago