గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సర్ప్రైజింగ్, సెలబ్రేటెడ్ వెడ్డింగ్స్లో కీర్తి సురేష్ది ఒకటని చెప్పాలి. కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే ఆమె ఆంటోనీ తట్టిల్ అనే తన లాంగ్ టైం బాయ్ఫ్రెండ్ను పెళ్లి చేసుకుంది. ఐతే ఆంటోనీతో ఆమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తను చెబితే కానీ.. మీడియాకు తెలియలేదు. ఫిలిం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి శోధించి తెలుసుకునే మీడియా.. కీర్తి విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.
కీర్తి ఫలానా నటుడిని పెళ్లాడబోతోంది.. ఆ సంగీత దర్శకుడితో ప్రేమలో ఉంది.. అంటూ రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి కానీ.. తన ఒరిజినల్ లవ్ గురించి వార్తలే రాలేదు. అందరికీ పెద్ద షాకిస్తూ తన ప్రేమ గురించి వెల్లడించి.. ఎక్కువ టైం తీసుకోకుండా ఆంటోనీని పెళ్లాడేసింది కీర్తి. పెళ్లి తర్వాతే తమ ప్రేమ కథ గురించి ఆసక్తికర విశేషాలను బయటపెడుతోంది కీర్తి.
తాజాగా తాను, ఆంటోనీ కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ఆమె వెల్లడించింది. తాను, ఆంటోనీ 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నామని.. తమ పెళ్లి అంత వైభవంగా జరుగుతుందని ఊహించలేదని కీర్తి చెప్పింది. తాము కచ్చితంగా లేచిపోయే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకున్నామని.. కానీ ఇంట్లో వాళ్లు అంగీకరించడంతో పెళ్లి తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగిందని ఆమె తెలిపింది.
ఎప్పుడూ చాలా దృఢంగా ఉండే ఆంటోనీ తాళి కట్టే సమయంలో ఎమోషనల్ అయ్యాడని.. తొలిసారి తన కళ్లలో నీళ్లు చూశానని.. అందుకే తాను కూడా కన్నీళ్లు పెట్టుకున్నానని.. కల నిజమైనట్లు అనిపించడంతో తామిద్దరం అంత భావోద్వేగానికి గురయ్యామని చెప్పింది కీర్తి. 15 ఏళ్ల ప్రేమకు సాక్ష్యంగా 30 సెకన్లలో అంతా అయిపోయిందని.. దీంతో ఆనంద భాష్పాలు ఆగలేదని.. ఇదొక అందమైన ప్రయాణం అని కీర్తి వ్యాఖ్యానించింది. 2024 డిసెంబరు 12న కీర్తి, ఆంటోనీ పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే.
This post was last modified on January 29, 2026 1:54 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…