అందరూ మర్చిపోయి ఎప్పుడో ఆలస్యంగా వస్తుందిలే అని భావిస్తున్న కల్కి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు రావడంతో ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. రాజా సాబ్ డిజాస్టర్ గాయం బాధలో ఉంటూ దర్శకుడు మారుతీని అదే పనిగా టార్గెట్ చేస్తున్న అభిమానులు ఇప్పుడు డైవర్ట్ అవుతున్నారు.
వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, డార్లింగ్ ఒక వారానికి పైగానే వర్కింగ్ డేట్స్ ఇచ్చాడనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే అసలైన టాస్క్ హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. పార్ట్ 1లో చాలా కీలకంగా వ్యవహరించిన దీపికా పదుకునే గత ఏడాదే తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు తన స్థానంలో సాయిపల్లవిని సంప్రదిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ఆమె అంగీకారం తెలిపిందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే కల్కిలో సుమతి పాత్ర చాలా కీలకం. సీక్వెల్ లో తనతో పాటు కమల్ హాసన్ క్యారెక్టర్ కు ఎక్కువ స్పేస్ దక్కనుంది. వీటిని బ్యాలన్స్ చేయడం దర్శకుడు నాగ్ అశ్విన్ కు పెద్ద టాస్క్.
అన్ని కోణాల్లో దీపికా కంటే సాయిపల్లవి బెటర్ పెర్ఫార్మరే కానీ మొదటి భాగం చూసిన కళ్ళతో ఇంత పెద్ద మార్పును అంగీకరించడం ఆడియన్స్ కి అంత సులభం కాకపోవచ్చు. ప్యాన్ ఇండియా మూవీ కావడం వల్ల అన్ని భాషల్లో యునానిమస్ యాక్సెప్టెన్స్ జరగాలి. ఇది అసలైన చిక్కు.
ఇంకోవైపు సాయిపల్లవికి కూడా ఇది ఛాలెంజే. ఎందుకంటే దీపికా స్థానంలో వచ్చింది కాబట్టి ముంబై మీడియా ప్రత్యేకంగా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ ఏక్ దిన్, రామాయణతో హిందీలో అడుగు పెట్టిన సాయిపల్లవి ఇప్పుడు కల్కి 2 కనక ఓకే చేస్తే మరిన్ని బలమైన అడుగులు బాలీవుడ్ వైపు వేసినట్టు అవుతుంది.
ఇప్పటికే స్క్రిప్ట్ స్టేజిలో రెండేళ్లు గడిపేసిన కల్కి 2 మీద వైజయంతి సంస్థ మరింత భారీ బడ్జెట్ పెట్టనుంది. హైప్ ని మ్యాచ్ చేసేలా ఎంత ఖర్చు పెట్టేందుకైనా అశ్వినిదత్ ఫ్యామిలీ సిద్ధంగా ఉంది. మరి సాయిపల్లవి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ప్రాజెక్టుకు మరో ప్రధాన ఆకర్షణ తోడవుతుంది.
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…
శివ, క్షణక్షణం, సత్య, రంగీలా లాంటి సినిమాలతో కల్ట్ మేకర్ అనిపించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫామ్ తగ్గిపోయిన…