‘పుష్ప-2’ తర్వాత బన్నీ నుంచి వస్తుందనుకున్న సినిమా వేరు. అతను ఎంచుకున్న సినిమా వేరు. త్రివిక్రమ్తో కొన్నేళ్ల నుంచి ప్లానింగ్లో ఉన్న చిత్రాన్ని పక్కన పెట్టి.. తమిళ దర్శకుడు అట్లీతో మూవీని పట్టాలెక్కించాడు బన్నీ. ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర్నుంచే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. హాలీవుడ్ లెవెల్లో నెవర్ బిఫోర్ మూవీ చేయడానికి బన్నీ, అట్లీ రెడీ అయినట్లు అందరికీ అర్థమైంది.
ఈ చిత్రం కోసం పదుల సంఖ్యలో హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుంది చిత్ర బృందం. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది సన్ పిక్చర్స్ సంస్థ. ఐతే సినిమాను ప్రకటించి ఏడాది దాటింది. షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంటివి ఏవీ రిలీజ్ చేయలేదు.
ఐతే ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు అట్లీ కూడా ఆ దిశగా సంకేతాలు ఇచ్చాడు. ఈ సినిమా అప్డేట్ కూడా అతను ఊరించే మాటలు చెప్పాడు.
ప్రతి రోజూ ఈ సినిమా అప్డేట్ గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని.. అప్డేట్ ఇవ్వడానికి తాము కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని అట్లీ చెప్పాడు. తాము సిద్ధం చేస్తున్నది చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. దాన్ని టేస్ట్ చేసినపుడు ‘మ్యాక్స్’ ఫీలింగ్ కలుగుతుందని అతనన్నాడు.
ఈ సందర్భంగా ఈ చిత్ర కథానాయిక దీపికా పదుకొనేపై ప్రశంసలు కురిపించాడు అట్లీ. ఇంతకుముందు ‘జవాన్’లోనూ ఆమెతో కలిసి పని చేశానని.. ఆమె తన లక్కీ ఛార్మ్ అని అట్లీ వ్యాఖ్యానించాడు. తల్లి అయ్యాక చేస్తున్న తొలి చిత్రంలో దీపిక సరికొత్తగా కనిపిస్తుందని అట్లీ తెలిపాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on January 28, 2026 11:51 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…