ఒక పెద్ద సీజన్ అయిపోతే దాని ప్రభావం బాక్సాఫీస్ మీద కొన్ని రోజులు లేదా ఒక్కోసారి కొన్ని వారాల పాటు ఉంటుంది. సంక్రాంతి కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. పండక్కు ఒకేసారి అయిదు సినిమాలు రావడంతో ఇతర నిర్మాతలు టూ వీక్స్ స్పేస్ వదిలేశారు. ఇప్పుడు అన్నీ సర్దుకున్నట్టే.
మన శంకరవరప్రసాద్ గారు ఒకటే ఇంకా అవర్లీ ట్రెండింగ్ కొనసాగిస్తుండగా, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి బాగా నెమ్మదించేశాయి. రాజా సాబ్ సెలవు తీసుకోవడానికి ఆల్రెడీ సిద్ధమైపోగా భర్త మహాశయులకు విజ్ఞప్తిని జనాలు సైడ్ చేశారు. ఇక జనవరి 30 వచ్చే కొత్త మూవీస్ కోసం ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఓం శాంతి శాంతి శాంతి ఒకటే ప్రమోషన్ల పరంగా కొంచెం సౌండ్ చేస్తోంది కానీ దీంతో పాటు మరో అరడజను కొత్త రిలీజులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. త్రిముఖ, దేవగుడి, జగన్నాథ్, వన్ బై ఫోర్, జమానా అంటూ బడ్జెట్ ఫ్రెండ్లీ సినిమాలు ఒకేసారి గంపగుత్తగా వస్తున్నాయి.
వీటికి ఓపెనింగ్స్ రావడం ఏమో కానీ కనీసం రిలీజ్ ఉందని ఆడియన్స్ కి రిజిస్టరయితే చాలనేలా ఉంది పరిస్థితి. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల సైలెంట్ మూవీ గాంధీ టాక్స్ మీద నిన్నటిదాకా బజ్ లేదు కానీ ట్రైలర్ వచ్చాక కాసింత అంచనాలు ఏర్పడ్డాయి. మంచి టాక్ తెచ్చుకుంటే నిలబడొచ్చు.
ఏతావాతా చెప్పేదేమంటే ఓం శాంతి శాంతిశాంతి కనక డీసెంట్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా గట్టెక్కుతుంది. మిగిలినవి మాత్రం ఎక్స్ట్రాడినరి అనిపించుకుంటేనే కనీసం పోటీ ఇవ్వగలవు. ఇవి కాకుండా అజిత్ గ్యాంబ్లర్ రీ రిలీజ్ ప్రకటించారు కానీ కొన్ని సెంటర్స్ బుకింగ్స్ తీసేయడం చూస్తుంటే వాయిదా పడిందేమోననే అనుమానం కలుగుతోంది.
తమిళంలో రికార్డులు సృష్టించిన మంకత డబ్బింగ్ వెర్షన్ కు ఇక్కడ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. పండక్కు కళకళలాడిన థియేటర్లు మెల్లగా ఆక్యుపెన్సీలు తగ్గిపోతున్న ప్రమాద ఘంటికలు వింటున్నాయి. మళ్ళీ ఊపు ఎవరైనా తెస్తారేమో ఇంకో నాలుగు రోజుల్లో తేలనుంది.
This post was last modified on January 27, 2026 10:17 pm
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…