పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్ అవుతున్నాడు. తన అనుమతి, ప్రమేయం లేకుండా ఏఐ లవ్ స్టోరీ అనే ఇండిపెండెంట్ మూవీని తీసి, దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం గురించి అకీరా కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే.
దానికి న్యాయస్థానం స్పందిస్తూ తక్షణం ఆ కంటెంట్ ని సస్పెండ్ చేయడమే కాక అతని ఫోటో, స్వరం తదితరాలు ఏ రూపంలోనూ వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇది జరిగే సమయానికే ఏఐ లవ్ స్టోరీ మిలియన్ వ్యూస్ దాటేయగా ఇంగ్లీష్ వెర్షన్ ని పాతిక వేల మంది చూసేయడం గమనార్హం.
ఇక్కడ అకీరా ఒకడే కాదు ఇకపై అందరూ ఇలాగే జాగ్రత్త పడే పరిస్థితులు రాబోతున్నాయి. ఆల్రెడీ చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్, జూనియర్ ఎన్టీఆర్, ఐశ్వర్యరాయ్ ఈ విషయంలో తమ హక్కులను కాపాడుకునేందుకు కోర్టు ద్వారా రక్షణ పొందారు. అసలే ఏఐని విచ్చలవిడిగా వాడుతున్న తీరు ఆందోళన రేపుతోంది.
ప్రస్తుతానికి కొన్ని పాజిటివ్ గా అనిపిస్తున్నప్పటికీ ఫ్యూచర్ లో ఇదే పెను ప్రమాదంగా మారే అవకాశాలు లేకపోలేదు. అసలు ఏఐ సామాన్యుల చేతికి రాకముందే రష్మిక మందన్న, అలియా భట్ లాంటి వాళ్ళు డీప్ ఫేక్ టెక్నాలజీ బారినపడి మానసిక క్షోభ అనుభవించారు. ఇప్పుడీ సాంకేతికత హద్దులు దాటేస్తోంది.
ఒక కంప్యూటర్ సిస్టం, కాసింత ఏఐ వాడే తెలివితేటలు ఉంటే చాలు ఏకంగా సినిమాలు తీసే స్థాయిలో టెక్నాలజీ పెరిగిపోయింది. జనాలు నిజమేదో అబద్దమేదో కనిపెట్టలేని పరిస్థితి రావొచ్చు. ఆ మధ్య మన టాలీవుడ్ స్టార్లందరూ ఒక కేఫ్ దగ్గర టీ తాగుతున్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఏఐ మీద అవగాహన లేనివాళ్లకు అది నిజమే అనిపించేలా ఉంది.
అకీరాతో పాటు మహేష్ బాబు కొడుకు గౌతమ్ ని కూడా పెట్టి ఒక ఏఐ మూవీ తీసిన ఘనుడు ఉన్నాడు. ఏది ఏమైనా మొగ్గ దశలోనే దీన్ని తుంచివేయడం చాలా అవసరం. లేదంటే పొలానికి పట్టిన పురుగు పంటంతా నాశనం చేసినట్టు దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
This post was last modified on January 27, 2026 10:01 pm
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు…