సినీ హీరోలను అభిమానించే విషయంలో ఇటు తెలుగు వాళ్లు.. అటు తమిళులు ఎవరికి వారే సాటి అన్నట్లుంటారు. సినిమా హీరోలను వాళ్లు దేవుళ్లలా చూస్తారు. ఇప్పుడంటే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేయడం.. అవతలి హీరోల మీద విషం చిమ్మడం ఒక రకమైన అభిమానంగా మారిపోయిన రోజులు చూస్తున్నాం.
కానీ తాము ఆరాధించే హీరో మీద అపారమైన ప్రేమను చూపిస్తూ.. వారి పేరు మీద ఎన్నో మంచి పనులు చేసి ఆ హీరోకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టే అభిమానులను ముందు తరంలో చాలామందిని చూడొచ్చు. అలా సూపర్ స్టార్ రజినీ మీద అభిమానంతో ఈ రోజుల్లో కూడా ఐదు రూపాయలకే పరోటా అమ్ముతూ.. సూపర్ స్టార్ ప్రేమను కూడా పొందిన ఒక అభిమాని వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని మదురైకి చెందిన శేఖర్ అనే అభిమాని.. చాలా ఏళ్ల నుంచి ఆ నగరంలో ఒక హోటల్ నడుపుతున్నాడు. సూపర్ స్టార్ పేరు మీదే ఈ హోటల్ పెట్టిన అతను.. 15 ఏళ్ల నుంచి ఐదు రూపాయలకే పరోటా అమ్ముతున్నాడు.
ఐతే మొదలుపెట్టినపుడు 5 రూపాయలకు పరోటా ఇవ్వడమంటే పెద్ద విషయం కాదు. కానీ ఈ రోజుల్లో కూడా ఆ రేటుతో పరోటా అమ్మడం చిన్న విషయం కాదు. కానీ రజినీ మీద అభిమానంతో అతను అదే రేటుతో పరోటాలు అమ్ముతూ హోటల్ నడుపుతున్నాడు.
ఎక్కువ లాభాలు ఆశించకుండా తన హోటల్కు వచ్చే జనాలకు కడుపు నింపడమే లక్ష్యంగా సాగిపోతున్నాడు. ఆ హోటల్లో అడుగుపెడితే నేమ్ బోర్డు నుంచి ప్రతి చోటా రజినీ ఫొటోలే కనిపిస్తాయి. శేఖర్ ఒంటి మీద కూడా రజినీ పేరు మీద పచ్చబొట్టు కనిపిస్తుంది.
ఈ వీరాభిమాని గురించి రజినీకి కూడా తెలియడంతో ఆయన స్వయంగా ఆ హోటల్కు వచ్చి తన పేరు మీద ఇంత చేస్తున్న శేఖర్కు బంగారు ఛైన్ కానుకగా ఇవ్వడమే కాక అతణ్ని సత్కరించడం విశేషం.
This post was last modified on January 26, 2026 1:09 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…