మెగాస్టార్ చిరంజీవి ఏ వేదిక మీద మాట్లాడినా.. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అభిమానులే తనకు ఇంధనం అని చెబుతుంటారు. ఈ క్రమంలో అద్భుతమైన ఉదాహరణలు కూడా చెబుతుంటారు. ఆ మధ్య ఒక మహిళ తనను విమర్శించిన రాజకీయ నాయకుడిని చెడామడా తిడుతూ తీవ్ర ఉద్వేగానికి గురైన విషయాన్ని చెప్పుకుని చిరు ఎమోషనల్ అయ్యారు.
తాజాగా తన కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సెలబ్రేషన్లలో భాగంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన చిరు.. ఒక మహిళా అభిమాని తన మీద చూపించిన అభిమానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘‘ఇటీవల ఒకావిడ మాట్లాడిన వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ వీడియోలో ఆమె ‘ఏమయ్యా చిరంజీవి ఎప్పటి నుంచో కష్టపడుతూనే ఉన్నావు. మమ్మల్ని ఆనందింపజేయడానికి ఓపిక ఉన్నా లేకపోయినా ఇప్పటికీ అలాగే పని చేస్తున్నావు. డబ్బుల కోసం నువ్వు పని చేస్తున్నావని నేను అనుకోను. నువ్వు ఇలా కష్టపడుతుంటే బాధగా ఉంది’ అని అన్నారు.
నిజంగా ఆ తల్లికి ఈ సభా ముఖంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఇది అందరూ ఇచ్చే ప్రశంస కాదు. ఇలాంటి అభిమానులను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ మాటలకు ఆనందంతో నా కళ్లు చెమర్చాయి.
అమ్మా మీకు ఆనందం ఇవ్వడానికి నేను కష్టపడినా సరే అందులో సంతోషాన్ని పొందుతున్నాను. చిరంజీవి మమ్మల్ని అలరించాలని కోరుకునే అభిమానుల పాజిటివ్ ఎనర్జీ నుంచే నాకు ఈ శక్తి వస్తోంది. ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’’ అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడారు చిరంజీవి.
This post was last modified on January 26, 2026 7:42 am
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…