మెగాస్టార్ చిరంజీవి ఏ వేదిక మీద మాట్లాడినా.. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అభిమానులే తనకు ఇంధనం అని చెబుతుంటారు. ఈ క్రమంలో అద్భుతమైన ఉదాహరణలు కూడా చెబుతుంటారు. ఆ మధ్య ఒక మహిళ తనను విమర్శించిన రాజకీయ నాయకుడిని చెడామడా తిడుతూ తీవ్ర ఉద్వేగానికి గురైన విషయాన్ని చెప్పుకుని చిరు ఎమోషనల్ అయ్యారు.
తాజాగా తన కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సెలబ్రేషన్లలో భాగంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన చిరు.. ఒక మహిళా అభిమాని తన మీద చూపించిన అభిమానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘‘ఇటీవల ఒకావిడ మాట్లాడిన వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ వీడియోలో ఆమె ‘ఏమయ్యా చిరంజీవి ఎప్పటి నుంచో కష్టపడుతూనే ఉన్నావు. మమ్మల్ని ఆనందింపజేయడానికి ఓపిక ఉన్నా లేకపోయినా ఇప్పటికీ అలాగే పని చేస్తున్నావు. డబ్బుల కోసం నువ్వు పని చేస్తున్నావని నేను అనుకోను. నువ్వు ఇలా కష్టపడుతుంటే బాధగా ఉంది’ అని అన్నారు.
నిజంగా ఆ తల్లికి ఈ సభా ముఖంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఇది అందరూ ఇచ్చే ప్రశంస కాదు. ఇలాంటి అభిమానులను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ మాటలకు ఆనందంతో నా కళ్లు చెమర్చాయి.
అమ్మా మీకు ఆనందం ఇవ్వడానికి నేను కష్టపడినా సరే అందులో సంతోషాన్ని పొందుతున్నాను. చిరంజీవి మమ్మల్ని అలరించాలని కోరుకునే అభిమానుల పాజిటివ్ ఎనర్జీ నుంచే నాకు ఈ శక్తి వస్తోంది. ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’’ అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడారు చిరంజీవి.
This post was last modified on January 26, 2026 7:42 am
భారత క్రికెట్లో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వారసుడు దొరికాడనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 మొదటి ఆరు నెలలు ఫుల్ ప్యాక్డ్ గా కనిపిస్తున్నాయి. జనవరిలో మన శంకరవరప్రసాద్ గారు…
టీమిండియా సెలక్షన్ లో పేరు లేకుంటే ‘జస్టిస్ ఫర్ సంజు శామ్సన్’ అనే ట్రెండ్ గత రెండేళ్లలో ఎక్కువగా కనిపించింది.…
వివాహేతర సంబంధాలు దేశంలో పెరుగుతున్నాయంటూ ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నా,…
న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్లో మరోసారి టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించింది. జనవరి 25న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం…