టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ AA22పై బజ్ మాములుగా లేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో స్పీడ్ పెంచుతున్నారు. ప్రస్తుతం ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రూపొందుతున్న ఈ సినిమా క్యాస్టింగ్ కూడా గట్టిగానే ఉండనుంది. ఇక సినిమాలో అల్లు అర్జున్ తో తలపడేందుకు ఒక పవర్ఫుల్ నటుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
కంటెంట్ ఉన్న నటుడిగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న జిమ్ సర్భ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. దేశంలో లో ప్రస్తుతం హీరోల తరువాత ఆర్టిస్టులలో అత్యధిక పారితోషకం తీసుకునే వారిలో ఈయన ఒకరు. గతేడాది విడుదలైన ‘కుబేర’ సినిమాతో జిమ్ సర్భ్ తెలుగు ఆడియన్స్కు పరిచయం అయ్యారు.
అందులో తన అద్భుతమైన నటనకు మంచి మార్కులు పడ్డాయి. నీర్జా, పద్మావత్, సంజు వంటి చిత్రాల్లో జిమ్ సర్భ్ చేసిన రోల్స్ అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లుగా నిలిచాయి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో జిమ్ సర్భ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా చాలా గ్రాండ్ గా ఉండబోతోంది. దీపికా పదుకొనే మెయిన్ ఫీమేల్ లీడ్గా నటిస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారని, విజయ్ సేతుపతి స్పెషల్ కామియో ఉండే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.
అల్లు అర్జున్ తన మార్కెట్ రేంజ్ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ సినిమాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అట్లీ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ కు జిమ్ సర్భ్ లాంటి పవర్ఫుల్ నటులు తోడవ్వడం సినిమాకు పెద్ద అసెట్. వరుస హిట్లతో ఉన్న అట్లీ.. బన్నీని ఒక సరికొత్త డైమెన్షన్లో చూపించడానికి రెడీ అయ్యారు. ఈ భారీ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…