అక్కినేని నాగచైతన్య భాగస్వామిగా తన జీవితంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ స్వతహాగా నటి అయినప్పటికీ తెరమీద రెగ్యులర్ గా కనిపించడం ఉండదు. తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి రెండు మూడు మూవీస్ తప్ప కంటిన్యూగా సినిమాలు చేయాలనే తాపత్రయం చూపించలేదు. ఎప్పుడైతే చైతు లైఫ్ పార్ట్ నర్ గా మారిపోయిందో అప్పటి నుంచి నాగ్ ఫ్యాన్స్ కు తనతో ఒక బాండింగ్ ఏర్పడిపోయింది.
పెళ్ళయాక తను నటించిన మొదటి మూవీ చీకటిలో తాజాగా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని చైతుతో పాటు పలువురు ఇండస్ట్రీ సెలబ్రిటీలకు ప్రత్యేక ప్రీమియర్ వేశారు.
చీకటిలో రూపంలో శోభితకు కంబ్యాక్ దొరికిందా అంటే ముందు దాంట్లో ఏముందో చూడాలి. కథ పరంగా మరీ డిఫరెంట్ గా అనిపించదు. సంధ్య అనే టీవీ జర్నలిస్ట్ తన ఉద్యోగంలో రాజీ పడలేక స్వంతంగా పాడ్ క్యాస్ట్ పెట్టుకుంటుంది. స్నేహితురాలు బాబీతో పాటు ఆమె ప్రియుడు దారుణంగా హత్యలకు గురయ్యాక దీని వెనుక ఉన్న నిజాలు తేల్చేందుకు రంగంలోకి దిగుతుంది.
అయితే ఫోన్ చేసి మరీ హత్యలు చేసే ఆ సైకో కిల్లర్ ఎవరో అర్థం కాక డిపార్ట్ మెంట్ కష్టపడుతున్న టైంలో సంధ్య వాళ్లకు తోడుగా నిలబడుతుంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చివరికి అసలు హంతకుడిని పట్టిస్తుంది.
స్టోరీగా చూస్తే ఇదో మాములు క్రైమ్ థ్రిల్లర్. దర్శకుడు శరన్ కోపిశెట్టి దీన్ని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో నడిపించడంలో తడబడ్డాడు. ఇన్వెస్టిగేషన్ మరీ నెమ్మదిగా సాగడంతో వేగం కోరుకునే ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతారు. స్పెషల్ ఆఫీసర్ గా ఈషా చావ్లా ఎంట్రీ తర్వాత కూడా కథనం స్లోగానే వెళ్ళడంతో ఎగ్జైట్ మెంట్ అంతకంతా తగ్గిపోతుంది.
ఎంత రొటీన్ గా ఉన్నా పరవాలేదనుకుంటే తప్ప చీకటిలో లీనమవ్వడం కష్టం. పెర్ఫార్మన్స్ పరంగా శోభిత ఓకే అనిపించుకుంది. సాలిడ్ కంబ్యాక్ అయ్యే అవకాశాన్ని చీకటిలో ఇవ్వకపోవచ్చు కానీ ఇలాంటి జానర్ లో బలమైన సబ్జెక్టులు చేస్తే మాత్రం మంచి ఇన్నింగ్స్ నిర్మించుకోవచ్చు.
This post was last modified on January 23, 2026 5:53 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…