తొమ్మిది నెలల పాటు సినీ ప్రియులను థియేటర్లకు దూరం పెట్టిన కరోనా కారణంగా తెలుగు సినిమా స్వరూపం మారిపోనుంది. మునుపటిలా థియేటర్లలో మాస్ ఆడియన్స్ని మెప్పించి పాస్ అయిపోయే కంటెంట్ మీద నిర్మాతలు ఆసక్తి కోల్పోయారు. మళ్లీ సినిమా థియేటర్లు ఎప్పటికి మామూలుగా రన్ అవుతాయనేది అనుమానంగానే వున్న నేపథ్యంలో వివిధ భాషల్లో వైవిధ్యభరిత సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రేక్షకులకు రొటీన్ కంటెంట్ ఇస్తే ముప్పు తప్పదని నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే ఫార్ములా కథలు చెబుతోన్న సీనియర్ దర్శకుల కంటే కొత్త ఆలోచనలతో వస్తోన్న యువతరాన్ని ఆదరిస్తున్నారు. ఇదివరకటిలా మూడు నుంచి అయిదు కోట్లు పెట్టి సినిమా తీస్తే అది మొత్తం బూడిదలో పోసినట్టే అనే భయం ఇప్పుడు లేదు. అలాంటి లో బడ్జెట్ సినిమాలు కొనడానికి కావాల్సినన్ని ఓటిటి కంపెనీలున్నాయి.
దీంతో ఇలాంటి సినిమాలు తీయమని బడా నిర్మాతలే ఎంకరేజ్ చేస్తున్నారు. ఓటిటి సినిమాలంటే కేవలం థ్రిల్లర్లు, రియలిజమ్ అక్కర్లేదని… మిడిల్ క్లాస్ మెలొడీస్, కృష్ణ అండ్ హిజ్ లీల లాంటి ఎంటర్టైనర్లు కూడా బాగా ఆదరణ పొందుతాయని రుజువవడంతో అలాంటి సహజమైన కథాంశాలను పట్టుకు రమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఆ తరహా చిత్రాలు పదుల సంఖ్యలో నిర్మాణం జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది ద్వితియార్థం నుంచి తెలుగు సినీ పరిశ్రమ నుంచి సినీ సునామీనే వీక్షించవచ్చునని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
This post was last modified on December 14, 2020 9:21 pm
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు నివురు గప్పిన నిప్పులా మొదలై…
ఆదిపురుష్ రిలీజైనప్పుడు ఎక్కువ శాతం ట్రోలింగ్ కి గురైన పాత్ర సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడు. దర్శకుడు ఓం…
పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడున్నా అభిమానులు మాకు ఒకటే ఉందన్న తీరులో ఎక్కడ చూసినా ఓజి జపంతో…
ఈ మధ్య కాలంలో తమిళ టైటిల్స్ ని యధాతథంగా ఉంచేసి తెలుగులో డబ్బింగ్ చేయడం పరిపాటిగా మారింది. తలైవి, వలిమైతో…
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అతిషిని ఆప్ నాయక త్వం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.…
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ? అనవసరంగా అతని…