తొమ్మిది నెలల పాటు సినీ ప్రియులను థియేటర్లకు దూరం పెట్టిన కరోనా కారణంగా తెలుగు సినిమా స్వరూపం మారిపోనుంది. మునుపటిలా థియేటర్లలో మాస్ ఆడియన్స్ని మెప్పించి పాస్ అయిపోయే కంటెంట్ మీద నిర్మాతలు ఆసక్తి కోల్పోయారు. మళ్లీ సినిమా థియేటర్లు ఎప్పటికి మామూలుగా రన్ అవుతాయనేది అనుమానంగానే వున్న నేపథ్యంలో వివిధ భాషల్లో వైవిధ్యభరిత సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రేక్షకులకు రొటీన్ కంటెంట్ ఇస్తే ముప్పు తప్పదని నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే ఫార్ములా కథలు చెబుతోన్న సీనియర్ దర్శకుల కంటే కొత్త ఆలోచనలతో వస్తోన్న యువతరాన్ని ఆదరిస్తున్నారు. ఇదివరకటిలా మూడు నుంచి అయిదు కోట్లు పెట్టి సినిమా తీస్తే అది మొత్తం బూడిదలో పోసినట్టే అనే భయం ఇప్పుడు లేదు. అలాంటి లో బడ్జెట్ సినిమాలు కొనడానికి కావాల్సినన్ని ఓటిటి కంపెనీలున్నాయి.
దీంతో ఇలాంటి సినిమాలు తీయమని బడా నిర్మాతలే ఎంకరేజ్ చేస్తున్నారు. ఓటిటి సినిమాలంటే కేవలం థ్రిల్లర్లు, రియలిజమ్ అక్కర్లేదని… మిడిల్ క్లాస్ మెలొడీస్, కృష్ణ అండ్ హిజ్ లీల లాంటి ఎంటర్టైనర్లు కూడా బాగా ఆదరణ పొందుతాయని రుజువవడంతో అలాంటి సహజమైన కథాంశాలను పట్టుకు రమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఆ తరహా చిత్రాలు పదుల సంఖ్యలో నిర్మాణం జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది ద్వితియార్థం నుంచి తెలుగు సినీ పరిశ్రమ నుంచి సినీ సునామీనే వీక్షించవచ్చునని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
This post was last modified on December 14, 2020 9:21 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…