ఆచార్య చిత్రంలో చరణ్ చేస్తోన్న పాత్రను అతిథి పాత్రలానే తీర్చిదిద్దాడు కొరటాల శివ. అయితే ఆ పాత్ర చరణ్తో చేయిద్దామని చిరంజీవి సలహా ఇచ్చిన పిమ్మట అందుకు అనుగుణంగా ఆ పాత్ర నిడివి పెంచారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్తో చరణ్ బిజీగా వుండడం, దాని కంటే ముందుగా చరణ్ మరో మల్టీస్టారర్ చేయడం తనకు ఇష్టం లేదని రాజమౌళి చెప్పడంతో మళ్లీ ఆ క్యారెక్టర్ లెంగ్త్ తగ్గించేసారు. అయితే లాక్డౌన్ కారణంగా ఆచార్య బాగా ఆలస్యం కావడం వల్ల ముందుగా అనుకున్న బడ్జెట్ ఇప్పుడు భారంగా మారింది. తన స్నేహితుడి నిర్మాణంలో ఈ చిత్రం చేస్తోన్న కొరటాల శివ పెరిగిన బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని చరణ్ క్యారెక్టర్ లెంగ్త్ పెంచితే తప్ప బడ్జెట్ వర్కవుట్ కాదంటూ చెప్పి మెగా హీరోలను లాక్ చేసాడట.
ఈ లాక్ డౌన్ అదీ లేనట్టయితే ఈ ప్రపోజల్కు రాజమౌళి అభ్యంతరం చెప్పి వుండేవాడేమో కానీ ఇప్పుడు తన సినిమా మరీ ఆలస్యం అవుతుండడం వల్ల అటు నుంచి కూడా పెద్దగా ఆక్షేపణలుండవు. అందుకే చరణ్ పాత్ర గురించి ఇంతకాలం మౌనంగా వున్న కొరటాల శివ ఇప్పుడా పాత్ర నిడివి గురించి ఓపెన్ అయిపోయాడు. అయితే ఆచార్య ముందు రిలీజ్ అయిన పక్షంలో ఈ తరంలోని అతి పెద్ద మల్టీస్టారర్గా ఆర్.ఆర్.ఆర్.కి వున్న క్రేజ్ ఏమైనా ఎఫెక్ట్ కావచ్చునేమో తెలీదు.
This post was last modified on December 14, 2020 9:16 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…
మంత్రి లోకేష్ చెప్పిన మాటలను ఎమ్మెల్యేలు తు.చ. తప్పకుండా చేస్తున్నారనడానికి శనివారం రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలే ఉదాహరణ. వాస్తవానికి…
గత ఏడాది విడుదలైన 'తెలుసు కదా' అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ…
బహుశా ఇలాంటి వెరైటీ భారీ బాక్సాఫీస్ క్లాష్ గతంలో చూసి ఉండం. ఒక హిందీ మూవీతో తెలుగు సినిమా కాంపీట్…
బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు…