ఆచార్య చిత్రంలో చరణ్ చేస్తోన్న పాత్రను అతిథి పాత్రలానే తీర్చిదిద్దాడు కొరటాల శివ. అయితే ఆ పాత్ర చరణ్తో చేయిద్దామని చిరంజీవి సలహా ఇచ్చిన పిమ్మట అందుకు అనుగుణంగా ఆ పాత్ర నిడివి పెంచారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్తో చరణ్ బిజీగా వుండడం, దాని కంటే ముందుగా చరణ్ మరో మల్టీస్టారర్ చేయడం తనకు ఇష్టం లేదని రాజమౌళి చెప్పడంతో మళ్లీ ఆ క్యారెక్టర్ లెంగ్త్ తగ్గించేసారు. అయితే లాక్డౌన్ కారణంగా ఆచార్య బాగా ఆలస్యం కావడం వల్ల ముందుగా అనుకున్న బడ్జెట్ ఇప్పుడు భారంగా మారింది. తన స్నేహితుడి నిర్మాణంలో ఈ చిత్రం చేస్తోన్న కొరటాల శివ పెరిగిన బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని చరణ్ క్యారెక్టర్ లెంగ్త్ పెంచితే తప్ప బడ్జెట్ వర్కవుట్ కాదంటూ చెప్పి మెగా హీరోలను లాక్ చేసాడట.
ఈ లాక్ డౌన్ అదీ లేనట్టయితే ఈ ప్రపోజల్కు రాజమౌళి అభ్యంతరం చెప్పి వుండేవాడేమో కానీ ఇప్పుడు తన సినిమా మరీ ఆలస్యం అవుతుండడం వల్ల అటు నుంచి కూడా పెద్దగా ఆక్షేపణలుండవు. అందుకే చరణ్ పాత్ర గురించి ఇంతకాలం మౌనంగా వున్న కొరటాల శివ ఇప్పుడా పాత్ర నిడివి గురించి ఓపెన్ అయిపోయాడు. అయితే ఆచార్య ముందు రిలీజ్ అయిన పక్షంలో ఈ తరంలోని అతి పెద్ద మల్టీస్టారర్గా ఆర్.ఆర్.ఆర్.కి వున్న క్రేజ్ ఏమైనా ఎఫెక్ట్ కావచ్చునేమో తెలీదు.
This post was last modified on December 14, 2020 9:16 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…