ఆచార్య చిత్రంలో చరణ్ చేస్తోన్న పాత్రను అతిథి పాత్రలానే తీర్చిదిద్దాడు కొరటాల శివ. అయితే ఆ పాత్ర చరణ్తో చేయిద్దామని చిరంజీవి సలహా ఇచ్చిన పిమ్మట అందుకు అనుగుణంగా ఆ పాత్ర నిడివి పెంచారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్తో చరణ్ బిజీగా వుండడం, దాని కంటే ముందుగా చరణ్ మరో మల్టీస్టారర్ చేయడం తనకు ఇష్టం లేదని రాజమౌళి చెప్పడంతో మళ్లీ ఆ క్యారెక్టర్ లెంగ్త్ తగ్గించేసారు. అయితే లాక్డౌన్ కారణంగా ఆచార్య బాగా ఆలస్యం కావడం వల్ల ముందుగా అనుకున్న బడ్జెట్ ఇప్పుడు భారంగా మారింది. తన స్నేహితుడి నిర్మాణంలో ఈ చిత్రం చేస్తోన్న కొరటాల శివ పెరిగిన బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని చరణ్ క్యారెక్టర్ లెంగ్త్ పెంచితే తప్ప బడ్జెట్ వర్కవుట్ కాదంటూ చెప్పి మెగా హీరోలను లాక్ చేసాడట.
ఈ లాక్ డౌన్ అదీ లేనట్టయితే ఈ ప్రపోజల్కు రాజమౌళి అభ్యంతరం చెప్పి వుండేవాడేమో కానీ ఇప్పుడు తన సినిమా మరీ ఆలస్యం అవుతుండడం వల్ల అటు నుంచి కూడా పెద్దగా ఆక్షేపణలుండవు. అందుకే చరణ్ పాత్ర గురించి ఇంతకాలం మౌనంగా వున్న కొరటాల శివ ఇప్పుడా పాత్ర నిడివి గురించి ఓపెన్ అయిపోయాడు. అయితే ఆచార్య ముందు రిలీజ్ అయిన పక్షంలో ఈ తరంలోని అతి పెద్ద మల్టీస్టారర్గా ఆర్.ఆర్.ఆర్.కి వున్న క్రేజ్ ఏమైనా ఎఫెక్ట్ కావచ్చునేమో తెలీదు.
This post was last modified on December 14, 2020 9:16 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…