కొన్ని సినిమాలకు టైం కలిసి రాదు. కంటెంట్ అంతో ఇంతో బాగున్నా జనాలకు రీచ్ కాక కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా నిలుస్తాయి. అవే ఓటిటిలో వచ్చినప్పుడు జనం ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. దండోరా పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది.
గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కాసులు తేలేదు. రివ్యూలు, ప్రశంసలు చాలానే వచ్చాయి కానీ థియేటర్లలో రావాల్సిన డబ్బులు అరకొరనే. దీనికి ప్రధాన కారణం పెద్ద సంస్థ నిర్మించిన ఛాంపియన్, హారర్ ఎలిమెంట్స్ తో మెప్పించిన శంబాల లాంటి వాటికి పోటీగా నిలవడం. ఇవే దెబ్బ కొట్టాయి.
సరే జరిగిన దాన్ని మార్చలేం కానీ ఇప్పుడు దండోరాకు సోషల్ మీడియాలో సపోర్ట్ దక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడంటే ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తారక్ ప్రతి సినిమాకు ఇలా రివ్యూ పెట్టడు. దండోరా విషయంలో మినహాయింపు ఇచ్చాడు.
అలాని దాంట్లో హీరో దర్శకుడితో తనకేం పరిచయం, స్నేహం లేదు. అయినా సరే ఒక మంచి మూవీ ఎక్కువ శాతం రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ట్వీట్ చేయడం మంచిదే. ఎందుకంటే డిజిటల్ లో వ్యూస్ ఎక్కువ రావడం వల్ల సదరు ప్రొడ్యూసర్ కు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.
నిజానికి దండోరాకు ప్రధానంగా జరిగిన డ్యామేజ్ శివాజీ కామెంట్స్. ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మంచి ఉద్దేశంతో నాలుగు మాటలు చెప్పినా దానికి అభ్యంతర పదాలు వాడటంతో ఏకంగా మహిళా కమీషన్ కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇదేదో పబ్లిసిటీకి ఉపయోగపడుతుందేమోనని మూవీ లవర్స్ భావిస్తే అనవసరమైన డైవెర్షన్ వచ్చి లేనిపోని నెగటివిటీని మూటగట్టుకుంది. ఒకవేళ ఎప్పుడైనా సోలోగా సరైన సమయంలో వచ్చి ఉంటే బలగం అంత కాకపోయినా దండోరా సౌండ్ బాగానే వినిపించేదన్నది వాస్తవం. అందుకే పెద్దలు అంటారు రైలు రావడం జీవిత కాలం ఆలస్యం అని. దండోరాకు జరిగింది ఇదే.
This post was last modified on January 19, 2026 10:08 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…