కొన్ని సినిమాలకు టైం కలిసి రాదు. కంటెంట్ అంతో ఇంతో బాగున్నా జనాలకు రీచ్ కాక కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా నిలుస్తాయి. అవే ఓటిటిలో వచ్చినప్పుడు జనం ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. దండోరా పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది.
గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కాసులు తేలేదు. రివ్యూలు, ప్రశంసలు చాలానే వచ్చాయి కానీ థియేటర్లలో రావాల్సిన డబ్బులు అరకొరనే. దీనికి ప్రధాన కారణం పెద్ద సంస్థ నిర్మించిన ఛాంపియన్, హారర్ ఎలిమెంట్స్ తో మెప్పించిన శంబాల లాంటి వాటికి పోటీగా నిలవడం. ఇవే దెబ్బ కొట్టాయి.
సరే జరిగిన దాన్ని మార్చలేం కానీ ఇప్పుడు దండోరాకు సోషల్ మీడియాలో సపోర్ట్ దక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడంటే ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తారక్ ప్రతి సినిమాకు ఇలా రివ్యూ పెట్టడు. దండోరా విషయంలో మినహాయింపు ఇచ్చాడు.
అలాని దాంట్లో హీరో దర్శకుడితో తనకేం పరిచయం, స్నేహం లేదు. అయినా సరే ఒక మంచి మూవీ ఎక్కువ శాతం రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ట్వీట్ చేయడం మంచిదే. ఎందుకంటే డిజిటల్ లో వ్యూస్ ఎక్కువ రావడం వల్ల సదరు ప్రొడ్యూసర్ కు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.
నిజానికి దండోరాకు ప్రధానంగా జరిగిన డ్యామేజ్ శివాజీ కామెంట్స్. ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మంచి ఉద్దేశంతో నాలుగు మాటలు చెప్పినా దానికి అభ్యంతర పదాలు వాడటంతో ఏకంగా మహిళా కమీషన్ కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇదేదో పబ్లిసిటీకి ఉపయోగపడుతుందేమోనని మూవీ లవర్స్ భావిస్తే అనవసరమైన డైవెర్షన్ వచ్చి లేనిపోని నెగటివిటీని మూటగట్టుకుంది. ఒకవేళ ఎప్పుడైనా సోలోగా సరైన సమయంలో వచ్చి ఉంటే బలగం అంత కాకపోయినా దండోరా సౌండ్ బాగానే వినిపించేదన్నది వాస్తవం. అందుకే పెద్దలు అంటారు రైలు రావడం జీవిత కాలం ఆలస్యం అని. దండోరాకు జరిగింది ఇదే.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…