మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు నారి నారి నడుమ మురారి రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. ఇంత తీవ్రమైన పోటీ, తక్కువ థియేటర్ల లభ్యతలోనూ హిట్ కొట్టే దిశగా వసూళ్లు వస్తుండటం టీమ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. క్రమంగా వీలైనన్ని స్క్రీన్లు పెంచే పనిలో నిర్మాత బిజీగా ఉన్నారు.
పండగ చివర్లో వచ్చినా ఉనికిని చాటుకోవడం శర్వాకు కొత్త కాదు. గతంలోను ఇలాంటి పెద్ద కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి గొప్ప విజయాలు సాధించాయి. ఇప్పుడు నారి నారి నడుమ మురారికి ఆ స్థాయి రెస్పాన్స్ దక్కుతుందా లేక వాటిని దాటుతుందా అనేది ఇంకొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.
ఇప్పుడీ పరిణామం శర్వా నెక్స్ట్ మూవీ బైకర్ కు కలిసి వస్తోంది. నిజానికి గత ఏడాది డిసెంబర్ 6 దీన్ని విడుదల చేద్దామని అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ గ్రాఫిక్స్ పనులతో పాటు ఇతరత్రా కారణాలు వాయిదాకు ప్రేరేపించాయి. ఆఖరి వారం ఆప్షన్ గా పెట్టుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల అదీ కుదరలేదు.
దీంతో నారి నారి నడుమ మురారికి లైన్ క్లియర్ అయ్యింది. ఫెస్టివల్ కు వచ్చి సైలెంట్ కిల్లర్ అయ్యింది. ఇప్పుడీ అడ్వాంటేజ్ బైకర్ కు ఉపయోగపడనుంది. ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో ఫిబ్రవరి రిలీజ్ గురించి నిర్మాతలు యువి క్రియేషన్స్ ఆలోచన చేస్తున్నారట. ఇంకా ఫైనల్ కాలేదు.
నారి నారి నడుమ మురారి సక్సెస్ కావడంతో బిజినెస్ పరంగా బైకర్ కు మరింత హైప్ వస్తోంది. దీని కోసం శర్వానంద్ చాలా కష్టపడ్డాడు. డైట్లు పాటించి, కసరత్తులు చేసి, బరువు బాగా తగ్గి రిస్కీ స్టంట్స్ చేశాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు . ఆయనకిది పెద్ద బ్రేక్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.
యువి సంస్థ వీలైనంత త్వరగా బైకర్ ని థియేటర్లకు తీసుకురావడం అవసరం. తర్వాత విశ్వంభర పనులు ఉంటాయి కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవాలంటే ముందు బైకర్ కి మోక్షం కలిగించాలి. తెరిచిన తలుపులను వాడుకోవాలి.
This post was last modified on January 16, 2026 10:53 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…