టాలీవుడ్ స్టార్ హీరోల్లో కథల ఎంపికలో మంచి జడ్జిమెంట్, సినిమాలు చేయడంలో తిరుగులేని ప్లానింగ్ ఉన్న స్టార్ హీరోగా అల్లు అర్జున్కు మంచి గుర్తింపు ఉంది. అతను ఏ కథనూ ఆషామాషీగా ఒప్పుకోడు. ఒక సినిమా తన కెరీర్కు ఏ విధంగా ఉపయోగపడుతుందో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ప్రతి చిత్రంతోనూ ఒక మెట్టు పైకి ఎదగాలని.. తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ విస్తరించాలని చూస్తాడు.
కాబట్టే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా ఉన్నాడు. ‘పుష్ప’తో చాలా పెద్ద రేంజికి ఎదిగిపోయిన బన్నీ.. దానికి ఫాలోఅప్గా అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ అది కూడా పక్కా ప్లానింగ్తో తీసుకున్న నిర్ణయమే అన్నది స్పష్టం. ఇప్పుడు లోకేష్ కనకరాజ్తో సినిమాను ఓకే చేయడమూ ఈ ప్లానింగ్లో భాగమే.
బన్నీకి ఎప్పట్నుంచో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. తెలుగు సినిమాల ద్వారా కర్ణాటకలోనూ బలమైన మార్కెట్ సంపాదించాడు. ఇక అనుకోకుండా ఎప్పుడో కేరళలో భారీగా అభిమానులను సంపాదించాడు. ‘పుష్ప’ మూవీతో నార్త్ ఇండియాలో అసాధారణమైన ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడు. అట్లీ ఆల్రెడీ ‘జవాన్’తో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇండియాలో బన్నీకి పెద్దగా ఆదరణ లేని రాష్ట్రం అంటే తమిళనాడు మాత్రమే.
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలు అక్కడ ఓ మాదిరిగా ఆడాయి కానీ.. బన్నీ మార్కెట్ అయితే బలపడలేదు. ఇప్పుడు అట్లీ, లోకేష్ కనకరాజ్ సినిమాలతో అతను ఆ మార్కెట్నూ కొల్లగొట్టడం గ్యారెంటీ. ఈ దర్శకుల వల్ల ఆ రెండు చిత్రాలూ తమిళంలో భారీగా విడుదలవుతాయి. స్ట్రెయిట్ సినిమాల స్థాయిలో రిలీజ్ ఉంటుంది.
ఈ సినిమాలు బాగుంటే అవి అక్కడ పెద్ద హిట్టయి బన్నీ తమిళంలోనూ పెద్ద స్టార్గా అవతరించే అవకాశముంది. ఆల్రెడీ విజయ్ సినిమాల నుంచి నిష్క్రమించడం.. మిగతా స్టార్లు సరైన సినిమాలను అందించకపోవడం వల్ల తమిళంలో ఒక వాక్యూమ్ ఏర్పడింది. దాన్ని బన్నీ క్యాప్చర్ చేయాలని చూస్తున్నాడు. డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే బన్నీది మామూలు ప్లానింగ్ కాదని అర్థమవుతుంది.
This post was last modified on January 15, 2026 10:44 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…