రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచకలేకపోవడంతో రేసులో వెనుకబడిన వైనం తెలిసిందే. ప్రభాస్ ఇమేజ్ రక్షణ కవచంలా ఉండటంతో రెండు వందల కోట్ల మార్కు ఈజీగా దాటేసింది కానీ లేదంటే లెక్క వేరుగా ఉండేది.
విడుదలకు ముందు చాలా కాన్ఫిడెన్స్ చూపించిన దర్శకుడు మారుతీ ఇప్పుడు కూడా గొప్ప సినిమా అంటున్నారే తప్ప పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించడం లేదు. అది ఒప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదు కానీ ఆశించిన రిజల్ట్ రాకపోవడానికి కొత్త అర్థం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రేక్షకులు పండగ మూడ్ లో ఉండటం వల్ల సినిమాని అర్థం చేసుకోలేకపోయారని, అదే వేరే టైంలో రిలీజ్ చేసి ఉంటే క్లైమాక్స్ గురించి ఎంతో కాలం చర్చించుకునేవాళ్ళని అన్నారు. సరే కాసేపు ఈ పాయింట్ నిజమే అనుకుందాం. అలాంటప్పుడు పుష్ప 2, యానిమల్ లాగా డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల చేసి ఉండొచ్చు.
కానీ ప్రకటించి మరీ వాయిదా వేశారు. ఏదో పోస్ట్ ప్రొడక్షన్ వల్ల లేట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే నిర్మాత విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో బయ్యర్లు సంక్రాంతికి అయితే ఎక్కువ రెవిన్యూ వస్తుందని చెప్పడం వల్లే వాళ్ళ కోరిక మేరకు నిర్ణయం మార్చుకున్నామని వివరించారు.
తీరా చూస్తే ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ప్యాట్రన్ లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయిపోగా మిగిలినవి కూడా డీసెంట్ టాక్ తెచ్చుకునే పనిలో ఉన్నాయి. ఎటొచ్చి రాజా సాబే ఎదురీదుతోంది. ఉత్తరాదిలో పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది.
తగిన రిపేర్లు, ఎడిటింగులు చేసుకుని వేరే టైంలో సోలోగా వచ్చి ఉంటే నిజంగా రాజా సాబ్ రిజల్ట్ చాలా బెటర్ గా ఉండేదేమో. విపరీతమైన నమ్మకంతో పోటీని తక్కువంచనా వేయడం వల్ల ఇప్పుడిలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే అసలు నిప్పు ఎక్కడ రాజుకుంటుందో ముందే గుర్తించి ఉంటే బాగుండేది.
This post was last modified on January 14, 2026 8:04 am
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…