రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా పరిణామాలు వేగమందుకున్నాయి. రాజా సాబ్ కు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులు ఇప్పుడు మెగా మూవీ మీద కన్నేస్తున్నారు. యుఎస్ లో అంచనాలకు మించి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
మిలియన్ చేరుకోవడం గురించి బలమైన అంచనాలున్నాయి. ట్రైలర్ మీద మిశ్రమ స్పందన కనిపించినప్పటికీ హుక్ స్టెప్ సాంగ్ వచ్చాక హైప్ అమాంతం మారిపోయింది. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు మొదటి రోజు బిగ్ నెంబర్స్ ఆశిస్తున్నారు.
మెగాస్టార్ ప్లస్ దర్శకుడు అనిల్ రావిపూడి బ్రాండ్ క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున పని చేస్తున్నాయి. ఆ బజ్ తాలూకు సౌండ్ సోషల్ మీడియాలో కనిపించకపోవచ్చు కానీ గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంకి మహారాజ పోషకులుగా మూడు వందల కోట్లు ఇచ్చింది కుటుంబ ప్రేక్షకులే.
అందుకే టీమ్ చాలా ధీమాగా ఉంది. వెంకటేష్ క్యామియో ఇరవై నిముషాలు ఉన్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం ఒక్క షాట్, మెగా విక్టరీ సాంగ్ లో మాత్రమే రివీల్ చేశారు. ఎమోషన్, చైల్డ్ కామెడీ, చిరు వెంకీ కాంబో ఎపిసోడ్ తాలూకు సర్ప్రైజులు బయటికి రాలేదు. ఇంకో రెండు పాటలు ఉన్నాయని, అవి నేరుగా థియేటర్లలో బ్లాస్ట్ అవుతాయని వినికిడి.
సంక్రాంతి పోటీలో మొదటి పుంజు రాజా సాబ్ ఏ దిశగా వెళ్తోందో క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక నెక్స్ట్ మన శంకరవరప్రసాద్ గారు ఏం చేస్తారనే దాని మీద ఇండస్ట్రీ వర్గాలు వెయిట్ చేస్తున్నాయి. భీమ్స్ పాటలు తమకిచ్చిన డ్యూటీ పూర్తి చేశాయి.
నయనతార ముందు చేసిన ప్రమోషన్లు కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా రాకపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలా లోటే కనిపించలేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా చిరంజీవి, కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడగా వెంకటేష్ నటించిన ఈ హిలేరియస్ మల్టీస్టారర్ టాక్ రేపు అర్ధరాత్రి లోపే వచ్చేస్తుంది. చూడాలి ఏం చేస్తుందో.
This post was last modified on January 10, 2026 1:00 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…